సూపర్ స్టార్ మహేష్ వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వస్తున్న సినిమా మహర్షి. దిల్ రాజు, అశ్వనిదత్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇక ఈ సినిమాపై కొన్నాళ్లుగా నెగటివ్ రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి.


మహేష్ మహర్షి మితిమీరిన బడ్జెట్ పెడుతున్నారని సినిమాకు అనుకున్న బడ్జెట్ మించి ఇప్పటికే భారీగా పెట్టేశారని అంటున్నారు. అసలైతే 80 కోట్ల బడ్జెట్ తెరకెక్కించాలని అనుకోగా ఇప్పుడు అది 100 కోట్లు అయ్యిందని తెలుస్తుంది. దిల్ రాజు బడ్జెట్ విషయంలో చాలా క్లియర్ గా ఉంటాడు.


మహర్షి సినిమాపై ఈ నెగటివ్ రూమర్స్ సినిమాపై బ్యాడ్ నేం తెచ్చి పెడుతున్నాయి. ఈ రూమర్స్ కు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నా సరే ఇంకా అవి కొనసాగుతూనే ఉన్నాయి. మహేష్ 25వ సినిమాగా మహర్షి భారీ అంచనాలతో వస్తుంది. సినిమాలో మహేష్ మూడు డిఫరెంట్ యాంగిల్స్ లో కనిపిస్తాడని తెలుస్తుంది.


2019 ఏప్రిల్ 5న రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ మూవీలో అల్లరి నరేష్ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందని తెలుస్తుంది. మొన్నామధ్య వచ్చిన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచగా భరత్ అనే నేను తర్వాత మహేష్ మహర్షి సినిమాతో కూడా హిట్ మేనియా కంటిన్యూ చేయాలని చూస్తున్నాడు.  



మరింత సమాచారం తెలుసుకోండి: