అన్ని రోజులూ ఒకలా ఉండవు. జీవితంలో ఎన్నో మార్పులు, ఆటుపోటులు సహజమే అయినా కొందరిలో వచ్చిన మార్పును చూస్తే అస్సలు జీర్ణించుకోలేం. అందులోనూ సెలబ్రెటీల విషయంలో ఈ మార్పు ఆశ్చర్యం కలిగిస్తుంది. విషయం ఏంటంటే.. ఒకనాటి అందాల నటి ఇప్పుడు పూర్తిగా ఆధ్యాత్మిక బాట పట్టేసింది.

Image result for manisha koirala IN BOMBAY

కుచ్ కుచ్ కూనమ్మా అంటూ అందాలొలికించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు నుదిటన అరచేతి మందం నామాలతో, బొట్టులతో భక్తురాలిగా దర్శనమిచ్చారు. వారణాశిలో మహా శివుడిని దర్శించుకునేందుకు పూర్తి సంప్రదాయ వస్త్రాలతో వచ్చి ఆశ్చర్యపరిచారు. ఈమెను చూసిన వారంతా ఒకనాటి మనీషాయేనా అనుకున్నారు.

Related image


సౌదాగర్ సినిమాతో 1991లో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ దాదాపు పదేళ్లకుపైగా బాలీవుడ్, టాలీవుడ్ లను ఊపేసింది. బొంబాయి, ఒకే ఒక్కడు, భారతీయుడు వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకూ దగ్గరైంది. సినిమాలు తగ్గుముఖం పట్టాక 8 ఏళ్ల క్రితం బిజినెస్ పర్సన్ సామ్రాట్ దహల్ ను పెళ్లి చేసుకుంది. ఐతే.. ఆ వివాహ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. రెండేళ్లకే ఆ పెళ్లి పెటాకులైంది.



అంతేనా.. అదే ఏడాది.. అందాల మనీషాను ఒవేరియన్ క్యాన్సర్ కబళించింది. మృత్యుముఖం వరకూ చేరుకున్న మనీషా.. క్రమంగా క్యాన్సర్ ను జయించింది. 2015 నుంచి పూర్తిగా క్యాన్సర్ ను విముక్తురాలైంది. ప్రస్తుతం ఆధ్యాత్మిక జీవినం సాగిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: