టాలీవుడ్ లో బయోపిక్ సినిమాలు వరుసగా వస్తున్న విషయం తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ‘ఎన్టీఆర్’బయోపిక్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ఎన్టీఆర్ బాల్యం నుంచి సినీ రంగంలో ఎలా వచ్చారు..రాజకీయాల్లోకి ఎందుకు వెళ్లారు అన్న అంశాలు ఉండబోతున్నాయట. ఈ సినిమా రెండు భాగాలు ఆయన సినీ నేపథ్యంలో ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ రాజకీయ నేపథ్యంలో ‘ఎన్టీఆర్ మహానాయకుడు’లుగా రాబోతున్నాయి. సంక్రాంతి అంటే బాలయ్యకు ఎంతో సెంటిమెంట్ అందుకోసమే ఈ రెండు భాగాలు జనవరి నెలలో ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమాలో పదుల సంఖ్యలో టాప్ హీరోయిన్లు నటించబోతున్నారు. సినీ నేపథ్యంలో ఎన్టీఆర్ తో ఎంతో మంది స్టార్ హీరోయిన్లు నటించారు..అందుకోసమే ‘ఎన్టీఆర్ కథానాయకుడు’చాలా కలర్ ఫుల్ గా తీస్తున్నట్లు టాక్. మొదటిభాగమైన 'కథానాయకుడు' షూటింగు పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. రెండవ భాగమైన 'మహానాయకుడు' షూటింగ్ చకచకా జరిగిపోతోంది.
ఈ మద్య ‘ఎన్టీఆర్’బయోపిక్ నుంచి ఫస్ట్ లిరిక్ రిలీజ్ చేశార్. ఎం ఎం కీరవాణి సంగీత సారథ్యంలో బాలీవుడ్ సింగర్ కైలాష్ ఖేర్ ఈ పాట ఆలపించారు. ఈ లిరిక్ కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ నేపథ్యంలో ‘ఎన్టీఆర్ ’ బయోపిక్ నుంచి రెండవ సింగిల్ ను వదలడానికి టీమ్ రెడీ అవుతోంది.
ఈ రోజు సాయంత్రం 4 గంటల 21 నిమిషాలకి 'రాజర్షి .. ' అంటూ సాగే సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నారు. మొన్న ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ కి సంబంధించిన సింగిల్ కాగా..నేడు ‘ఎన్టీఆర్ మహానాయకుడు’పాటకు సంబంధించిన సింగిల్ రిలీజ్ చేయబోతున్నారు. కీరవాణి స్వరపరిచిన ఈ పాట ఏ స్థాయిలో దూసుకెళుతుందో చూడాలి మరి.