ఈ మద్య సోషల్ మీడియాలో సెలబ్రెటీల గురించి ఏ చిన్న వార్త అయినా క్షణాల్లో వైరల్ అవుతుంది. ముఖ్యంగా కాంట్రవర్సీలకు సంబంధించిన ఐటమ్స్, వీడియోలు సోషల్ మీడియలో క్షణాల్లో వైరల్ అవుతూ..సెలబ్రెటీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అలాంటి రూమర్లు వచ్చినపుడు వాటిపై క్లారిటీ ఇవ్వలేక నానా తంటాలు పడుతుంటారు. తాజాగా బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ కు క్యాన్సర్ సోకినట్లు రెండుమూడు రోజులుగా వార్తలు చక్కర్లు విషయం తెలిసిందే.
అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ లో నటిస్తున్న షాహిద్.. షూటింగ్ కు సుదీర్ఘ విరామం తీసుకోవడంతో..అతనికి ఉదర క్యాన్సర్ వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలు చూసి ఆయన అభిమానులు కంగారు పడ్డారు. సన్నిహితులు వారి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వివరాలు తెలసుకోవడం మొదలు పెట్టారు. దాంతో హీరో షాహిద్ కపూర్ సోషల్ మీడియాలో స్పందించారు. ఎక్కడ నుంచి పుడతాయో కూడా తెలియదు..కానీ ఇలాంటి పుకార్లతో మనుషులు ఆవేదన చెందుతారన్న విషయం మర్చిపోతారని ఆవేదన చెందారు. ‘నేను బాగానే ఉన్నాను. అనవసరమైన పుకార్లను నమ్మకండి’ అంటూ ట్వీట్ చేసి ఫ్యాన్స్కున్న డౌట్ని క్లియర్ చేశారు.
అంతే కాదు మీడియాతో మాట్లాడుతూ ‘ఏ సంఘటన ఆధారంగా ఇలాంటి కథనాలు అల్లుతారు? ఇలాంటి నిజంలేని వార్తలను ప్రచారం చేస్తే ఊరుకునేది లేదు’ అని పేర్కొన్నారు. అవాస్తవ విషయాలను నమ్మకండని స్పష్టత ఇచ్చాడు. కబీర్ సింగ్ షూటింగ్ నుంచి విరామం తీసుకున్న షాహిద్ కపూర్ ప్రస్తుతం ఢిల్లీలో తన కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. కొత్త సంవత్సర వేడుకల తర్వాత ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు షాహిద్.