టాలీవుడ్ లో పది సంవత్సరాల సుదీర్ఘ విరామం తీసుకొని వివివినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నెంబర్ 150’తో రీ ఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. చాలా కాలం తర్వాత రీ ఎంట్రీ పై రక రకాల అనుమానాలు వచ్చాయి. ఈ సినిమా చూసిన తర్వాత అందరూ చిరంజీవి స్టామినా ఎక్కడికీ పోలేదని..బాస్ ఈజ్ బ్యాక్ అంటూ సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు రాంచరణ్ నిర్మాతగా ఉన్నారు. బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా షూటింగ్ కొనసాగుతున్నారు.
బ్రిటీష్ పాలనపై ఎదురు తిరిగిన గొప్ప స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా పూర్తి అయిన తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమాలో నటించబోతున్నారు చిరంజీవి. ఈ సినిమా కోసం కొంత మంది హీరోయిన్ల పేర్లు అనుకున్నా..చివరికి నయనతార నే ఫైనల్ చేసినట్లు సమాచారం. కొరటాల శివ చిరంజీవి కోసం ఓ సోషల్ మెసేజ్తో కూడుకున్న కమర్షియల్ స్టోరీ రెడీ చేసే పనిలో ఉన్నారు.
ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి.ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి స్టార్ట్ కానుంది. మొదట ఈ సినిమా కోసం అనుష్క, తమన్నా, త్రిష అనుకున్నారు..కానీ చివరకు ఈ ప్రాజెక్ట్లో హీరోయిన్గా నయనతార పేరుని ఓకే చేశారట చిత్రబృందం. చిరు, నయన్ ప్రసుత్తం ‘సైరా’ చిత్రంలో యాక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. దాంతో మరోసారి చిరంజీవి పక్కన నటించే చాన్స్ కొట్టేశారు నయనతార. మరి అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాలి.