స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య తర్వాత ఏ సినిమా చేస్తున్నాడు అన్న విషయం మీద ఇంకా అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ రాలేదు. అసలైతే త్విక్రం డైరక్షన్ లో సినిమా ఉంటుందని చెబుతున్నా అది ఇంకా సెట్స్ మీదకు వెళ్లలేదు. లేటెస్ట్ గా బన్ని డైరక్టర్స్ లిస్ట్ లో పరశురాం కూడా చేరిపోయాడు. 


గీతా గోవిందం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ డైరక్టర్ తో సినిమా అంటే మినిమం గ్యారెంటీ అని నిర్మాతలు క్యూ కడుతున్నారు. అయితే పరశురాం ఇప్పటికే రెండు కథలను సిద్ధం చేసుకోగా హీరోలు లేకనే సినిమా స్టార్ట్ చేయలేదట. స్టార్ హీరోలు అప్పుడే ఇతనికి ఛాన్స్ ఇచ్చే అవకాశం లేదని అంటున్నారు.


ఇదిలాఉంటే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పరశురాం చెప్పిన కథకు ఫ్లాట్ అయ్యాడట. లైన్ బాగుందని డెవలప్ చేయమని చెప్పారట. ఫుల్ స్క్రిప్ట్ ఇంప్రెస్ చేస్తే పరశురాం తో బన్ని సినిమా షురూ అయినట్టే. ఆల్రెడీ గీతా ఆర్ట్స్ తో పాటుగా అల్లు శిరీష్ కు హిట్ ఇచ్చాడు పరశురాం అందుకే అతని మీద నమ్మకం ఉంచాడు బన్ని. 


త్రివిక్రం సినిమా లేకపోతే పరశురాం సినిమా ఉంటుందని అంటున్నారు. అయితే గీతా ఆర్ట్స్ లో ఫుల్ స్క్రిప్ట్ ఓకే చేయాలంటే కనీసం 6 నెలలు అయినా పడుతుందట. అందుకే ఈలోగా త్రివిక్రం సినిమా పూర్తి చేశాకే పరశురాం తో సినిమా ఉంటుందని చెబుతున్నారు. ఏది ఏమైనా పరశురాం బన్ని సినిమా తప్పకుండా మెగా ఫ్యాన్స్ ఎంజాయ్ చేసే సినిమా అవుతుందని చెప్పొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: