అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ మొదటి రెండు సినిమాలు భారీ అంచనాలతో వచ్చిన అవి ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయాయి. మొదటి సినిమా అఖిల్ డిజాస్టర్ అవగా విక్రం కుమార్ డైరక్షన్ లో వచ్చిన హలో కూడా నిరాశపరచింది. అయితే అఖిల్ ఇప్పుడు 3వ ప్రయత్నంగా మిస్టర్ మజ్ను సినిమా చేస్తున్నాడు.


తొలిప్రేమ హిట్ అందుకున్న వెంకీ అట్లూరి డైరక్షన్ లో వస్తున్న ఈ మిస్టర్ మజ్ను సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. వరుణ్ తేజ్ తో తొలిప్రేమ సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్న వెంకీ అట్లూరి తన మార్క్ ఏంటో మిస్టర్ మజ్ను లో కూడా చూపిస్తున్నాడు. అయితే ఈ సినిమా ఫలితంపై అఖిల్ కన్నా నాగార్జునకు ఎక్కువ టెన్షన్ పట్టుకుందట. 


ఓ పక్క యువ హీరోలంతా వరుస సక్సెస్ లతో దూసుకెళ్తుంటే అఖిల్ ఇంతవరకు హిట్ ఖాతా తెరవలేదు. మరో పక్క నాగ చైతన్య కెరియర్ కూడా అంత మంచి ట్రాక్ లో లేదు. అందుకే ఇకనుండి కథల ఎంపికలో మరింత జాగ్రత్త వహించేలా నాగార్జున తనయులిద్దరికి సలహాలిస్తున్నాడట. ఎలాగు ఫ్లాపుల్లో ఉన్నారు కాబట్టి వారికి హిట్ కొట్టాలన్న కసి పెరిగింది.


అఖిల్ మిస్టర్ మజ్ను రిజల్ట్ తేడా కొడితే మాత్రం అతను ఇక రూట్ చేంజ్ చేయక తప్పదు. లవర్ బోయ్ ఇమేజ్ కోసమే ట్రై చేస్తున్న అఖిల్ మాస్ అండ్ కమర్షియల్ హీరోగా ఇప్పుడప్పుడే కష్టమని అనిపిస్తుంది. నాగ చైతన్య, అఖిల్ కెరియర్ మీద ఎక్కువ శ్రద్ధ పెడుతున్న నాగార్జున తన కెరియర్ విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: