తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి  నమ్రత శిరోడ్కర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటుంది.  మహేష్ బాబు తన కుంటుంబంతో విదేశాల్లో ట్రిప్ కి వెళ్లిన సమయంలో అక్కడ ఫోటోలు షేరూ చేస్తూ అభిమానులతో తమ అనుభవాలు షేర్ చేసుకుంటుంది.  తాజాగా నమ్రత సోషల్ మీడియా వేదికగా ప్రముఖ ఫుడ్ డెలివెరీ సంస్థ జొమాటో మీద ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. 

జొమాటో డెలివెరీ బాయ్ ఒకరు కస్టమర్ ఆర్డర్ చేసిన ఫుడ్ ప్యాకెట్స్ ని ఓపెన్ చేసి కొంచెం కొంచెం తిని, తిరిగి ప్యాక్ చేసి డెలివెరీ చేశాడు. ఈ తతంగం అంతా వీడియోలో బంధించారు.  దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ  వీడియోని చూసి నెటిజన్లు ఫైర్ అవుతున్నారు..ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఆర్డర్ చేసిన ఫుడ్ మనకు వస్తుందా అని ఆశ్చర్యపోతున్నారు. 

ఈ వీడియో పై నమ్రత సైతం సీరియస్ అయ్యింది..తన ఇన్స్టాగ్రామ్ లో ఈ వీడియో షేర్ చేసి చెడామడా తిట్టేసింది. ఆమె పెట్టిన పోస్ట్ లో ''ఇంత పేరున్న ఫుడ్ డెలివెరీ సంస్థ పనితీరు చూస్తుంటే షాకింగ్ గా ఉంది. ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసే వాళ్లు కనీస శుభ్రతని ఆశిస్తారు.   ఈ విధంగానా డెలివర్ చేసేది..? మీకు వర్క్ ఎథిక్స్ అనేవే లేవా..? ఇదంతా చూస్తుంటే ఫుడ్ ఆర్డర్ చేయాలంటే భయం వేస్తుంది.  నా పిల్లలను మాత్రం ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేయనివ్వను. అందరికీ కూడా నా సజెషన్ ఇదే..'' అంటూ రాసుకొచ్చారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: