బాలకృష్ణను టార్గెట్ చేస్తూ నాగబాబు కామెంట్స్ చేసి కొద్ది రోజులు కూడ గడవకుండానే ఇప్పుడు బాలయ్యను టార్గెట్ చేస్తూ పోసాని కృష్ణమురళి రంగంలోకి దిగడంతో బాలయ్య చుట్టూ ఈముప్పేట దాడి ఏమిటి అంటూ అభిమానులు తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. అంతేకాదు ఇండస్ట్రీ వర్గాలు కూడ బాలకృష్ణ పై పెరిగిపోతున్న ఈ సెటైర్లు మళ్ళీ ఫిలిం ఇండస్ట్రీలోని విభేదాలను మరొకసారి బయటపెడుతుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 
ఆయన మాట అంటే వెనక్కి తీసుకోరు
నిన్న ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ పోసాని బాలయ్యను టార్గెట్ చేస్తూ ఘాటైన కామెంట్స్ చేసాడు. తెలంగాణ రాష్ట్ర అధినేతలు ఏపీలో అడుగు పెడితే తాట తీస్తా అని బాలయ్య ఇటీవల కూకట్‌ పల్లి మీటింగులో అన్న విషయం గురించి మీడియా ప్రతినిధులు పోసాని వద్ద ప్రశ్నించినప్పుడు పోసాని తన సహజ శైలిలో స్పందించాడు. ‘ఆయన ఆ మాట అన్నాడా?' ఆయన గురించి మీకు తెలుసుగా చాలా తాటలు తీశారు' అంటూ పోసాని వ్యాఖ్యానించాడు.
ఆయన ఎంతో పవర్ ఫుల్
బాలకృష్ణ తండ్రి రామారావును వెన్నుపోటు పొడిస్తే ఆ వెన్నుపోటు పొడిచిన వ్యక్తి తాట తీశాడు అదేవిధంగా ఎన్టీఆర్ మీద అప్పట్లో వైస్రాయ్ హోటల్ వద్ద కొందరు చెప్పు విసిరితే వాళ్ళను ఇంరగోట్టాడు అంటూ పోసాని బాలయ్య పై ఘాటైన సెటైర్లు వేసాడు.  అంతేకాదు బాలయ్య ఒకసారి మాట అంటే వెనక్కు తీసుకోడని తన తండ్రిని వెన్నుపోటు పొడిచిన వ్యక్తిని కాళ్ళతో తొక్కి బయటకు పంపివేయడం ఖాయం అంటూ మరో ట్విస్ట్ ఇచ్చాడు. 
బాలయ్య చాలా తాటలు తీశాడు
ఇటీవల జరిగిన ఎన్నికలల్లో తాను కేసీఆర్‌ కు ఓటేశాను అని చెపుతూ ఆయన గెలవడంతనకు సంతోషంగా ఉందని కామెంట్ చేసాడు. ఇక రాబోతున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో జగన్ గెలవడం ఖాయం అంటూ జోష్యం చెపుతున్నాడు పోసాని. దీనినిబట్టి చూస్తుంటే రానున్న రోజులలో పోసాని జగన్ కోసం ఆంధ్రప్రదేశ్ లో పర్యటనలు చేస్తూ బాలకృష్ణను అదేవిధంగా తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ బహిరంగ ప్రచారం చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి  అనుకోవాలి..    



మరింత సమాచారం తెలుసుకోండి: