టాలీవుడ్ మార్కెట్ ఓ మోస్తారుగా ఉన్నప్పుడే భారీ సెట్లు వేసి హిట్లు అందుకున్నాడు డైరక్టర్ గుణశేఖర్. ఆయన అనుకున్న కథకు అనుకున్న విధంగా సెట్ వేసేందుకు నిర్మాతను ఒప్పించాకే సినిమా మొదలుపెడతాడు. అయితే గుణశేఖర్ అనవసరంగా ఖర్చు చేయిస్తాడన్న టాక్ ఉంది. 


తన స్వీయ దర్శకత్వంలో నిర్మాతగా చేసిన రుద్రమదేవి సినిమా 80 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. 3డిలో అయ్యే సరికి ఓ పది ఎక్స్ ట్రా అయ్యాయే తప్ప అనుకున్న బడ్జెట్ లోపల ముగించింది లేదు. అయితే సినిమా బాగున్నా బడ్జెట్ ఎక్కువవడం వల్ల ఫైనల్ గా సేవ్ ప్రాజెక్టే అనిపించుకున్నా పెద్దగా లాభాలు తీసుకు రాలేదు. 


ఇక ఇప్పుడు రానా దగ్గుబాటి లీడ్ రోల్ లో గుణశేఖర్ హిరణ్యకశ్యప సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. జనవరి నుండి సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ సినిమాను సురేష్ బాబు 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారని అంటున్నారు. బాహుబలి తర్వాత సౌత్ సినిమాల స్పాన్ పెరిగినా ఎంచుకున్న కథ.. దాన్ని డీల్ చేసే విధానం రెండు బాగా కుదరాలి


అలా కుదరకపోతే పద్మావతి, థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ సినిమాల మాదిరి నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. గుణశేఖర్ టాలెంట్ గురించి అందరికి తెలిసినా కాస్త జాగ్రత్త పడితే మంచిదని అంటున్నారు. మొత్తానికి రానాతో గుణశేఖర్ చేస్తున్న హిరణ్యకశ్యప సినిమా మరోసారి తెలుగు సినిమా స్టామినాను చూపించేందుకు సిద్ధమవుతుందని చెప్పొచ్చు.   



మరింత సమాచారం తెలుసుకోండి: