అక్కినేని అఖిల్ 3వ సినిమాగా వస్తున్న సినిమా మిస్టర్ మజ్ను. వెంకీ అట్లూరి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను బివిఎసెస్న్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. అఖిల్ సరసన నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. వెంకీ అట్లూరి మొదటి సినిమా తొలిప్రేమకు తమన్ మ్యూజిక్ అందించాడు.


లవ్ స్టోరీగా వచ్చిన ఆ సినిమా మ్యూజికల్ గా కూడా బాగా హిట్ అయ్యింది. ముఖ్యంగా నిన్నలా నిన్నలా సాంగ్ అయితే యూత్ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంది. రాబోతున్న మిస్టర్ మజ్ను సినిమాలో కూడా తమన్ ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తున్నాడట తమన్. ఈ సినిమా నుండి మొదటి సాంగ్ రిలీజ్ చేశారు.


ఏమైందో అంటూ వచ్చిన ఈ సాంగ్ కు తమన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. శ్రీమణి సాహిత్యం అందించిన ఈ పాటను అర్మన్ మాలిక్ పాడటం జరిగింది. కచ్చితంగా ఈ సాంగ్ యువతను ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు. సినిమా పాట వింటే సందర్భం కూడా చెప్పేలా ఉంది. హీరోని కాదని హీరోయిన్ వెళ్లిన తర్వాత ఈ సాంగ్ వస్తుందని అనిపిస్తుంది.  


అఖిల్, హలో సినిమాల తర్వాత అఖిల్ చేస్తున్న ఈ మూవీపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. సినిమా రష్ చూసి సినిమా అనుకున్న దానికన్నా అద్భుతంగా వస్తుందని అంటున్నారు. సినిమా మొత్తం ఫారిన్ లో షూట్ చేశారు. మరి అఖిల్ కెరియర్ ను ఈ మిస్టర్ మజ్ను ఎలాంటి టర్న్ తిప్పుతుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: