తారా
చౌదరి..
ఈ
పేరు వార్తల్లోకి రాక చాలా
కాలమైంది కదా..
మళ్లీ
ఓ వ్యక్తి పుణ్యమా అని తారా
చౌదరి వార్తల్లోకి వచ్చింది.
ఇప్పుడు
విచిత్రం ఏంటంటే..
తారా
చౌదరే ఇప్పుడు బాధితురాలు..
అవును..
కిలాడీ
క్వీన్ గా పేరున్న తారా చౌదరినే
ఈ వ్యక్తి మోసం చేశాడట.
ఇంతకీ
అతగాడెవరో కాదు.
ఆమె
బావేనట.
పెళ్లి పేరుతో తన బావ రాజ్కుమార్ మోసం చేశాడంటూ తారా చౌదరి హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. గతంలో రాజ్కుమార్ సోదరి సుజాతతో తనకు సన్నిహిత సంబంధాలుండేవట. తన అన్న రాజ్కుమార్ను వివాహం చేసుకోవాలని సుజాత తనను కోరిందట. అప్పటికే రాజ్కుమార్కు వివాహమైనందువల్ల అతడు విడాకులు తీసుకుంటాడని సుజాత నమ్మించిందట.
రాజ్కుమార్ పై నమ్మకం లేక తాను పెళ్లికి అంగీకరించలేదని తారాచౌదరి తన ఫిర్యాదులో పేర్కొంది. ఆ తర్వాత తాను హైదరాబాద్ నుంచి తాను విజయవాడకు వెళ్లిపోయిందని.. కానీ రాజ్ కుమార్ అక్కడికి వచ్చి తన భర్తగా అందరికీ చెప్పుకుంటున్నాడని తారా చౌదరి పోలీసులకు తెలిపింది. ఇప్పుడు తాను తనను పెళ్లి చేసుకోవాలని అడిగితే తప్పించుకుంటున్నాడని వాపోతోంది తారా చౌదరి. కేసు నమోదుచేసిన బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
జూనియర్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన ఈ అమ్మడు.. అదనపు సంపాదన కోసం వ్యభిచారం ప్రారంభించింది. సినిమా ఛాన్సుల కోసం వచ్చిన అమ్మాయిలను నగ్నంగా చిత్రీకరించి.. బ్లాక్మెయిల్ కు దిగేది. వాటిని అడ్డం పెట్టుకుని సెక్స్ రాకెట్ నడిపేది. రాజకీయ నేతలను మంచి చేసుకుని తన దందా కొనసాగించింది. గుంటూరు జిల్లాకు చెందిన ఈ అమ్మడుపై ఎన్నో కేసులు నమోదయ్యాయి. మహామహ టాలీవుడ్ , పొలిటికల్ ప్రముఖులకే చుక్కలు చూపించిన తారా చౌదరి ఇప్పుడు సొంత బావ చేతిలోనే మోసపోయాననడం ఆశ్చర్యమే.