తారక రాములిద్దరూ ఒకే వేదికపై కనిపించబోతున్నారా.. కల్వకుంట్ల తారక రామారావు, నందమూరి తారక రామారావు.. ఇద్దరూ ఒకే వేదికపై కనిపించే సన్నివేశం త్వరలోనే ప్రత్యక్షం కానుందా.. ఇప్పుడు టాలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్. ఇంతకూ వీరిద్దరూ ఒకే వేదికపైకి వచ్చే కార్యక్రమం ఏమై ఉంటుంది..
రామ్చరణ్ తాజా చిత్రం ‘వినయ విధేయ రామ’ సంక్రాంతికి విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ప్రీ రిలీజ్ ఫంక్షన్.. అంగరంగ వైభవంగా చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ వేడుకకు RRR యూనిట్ను కూడా ఆహ్వానించాలని నిర్మాత భావిస్తున్నారట.
అలాగే ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్కు టీఆర్ఎస్ నేత కేటీఆర్ను కూడా ఆహ్వానించాలని భావిస్తున్నారట. కేటీఆర్ ఈ నిర్మాత ఆహ్వానాన్ని మన్నిస్తే.. కల్వకుంట్ల తారక రాముడు, నందమూరి తారక రాముడు .. ఇద్దరూ ఒకే వేదికపై కనిపించే అవకాశం ఉంది.కేటీఆర్, ఎన్టీఆర్ మధ్య చక్కటి అనుబంధమే ఉంది.
నందమూరి హరికృష్ణ అంత్యక్రియలకు కేటీఆర్ హాజరయ్యారు. సర్కారు లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు. అందుకే ఎన్టీఆర్ .. ఇటీవల తన సోదరి కూకట్ పల్లి ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసినా ప్రచారానికి రాలేదు. మరి ఈ నిర్మాత ప్రయత్నం ఫలిస్తే.. చూసేందుకు రెండు కళ్లూ చాలవేమో..