రష్మిక గీత గోవిందం తో ఎక్కడ లేని క్రేజ్ ను సంపాదించింది . అయితే ఆ మధ్యన రష్మిక తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా రష్మిక ఓ ఫోటో షూట్ చేసింది. ఈ ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందాలు ఆరబోయడానికి చేసిన ఫోటో షూట్ కాదు. మానవ మనుగడకు కారణమైన గాలి, నీరు, నేల కాలుష్యం బారీన పడుతున్న సంగతి తెలిసిందే. కాలుష్యం గురించి ప్రజలని చైతన్యపరిచే కార్యక్రమాలు ఎన్ని చేసినా ఫలితం మాత్రం సూన్యం.

వరుస చిత్రాలతో

తాజాగా రష్మిక ఆ బాధ్యతని తీసుకుంది. సామజిక కార్యక్రమాల విషయంలో తాను కూడా ముందుంటానని రష్మిక తెలియజేసింది. నీటి కాలుష్యం గురించి చైతన్యం కలిగించేందుకు రష్మిక చేసిన ఫోటో షూట్ వైరల్ అవుతోంది . రష్మిక ఓ కొలనులో మునుగుతున్నట్లు ఫోటో షూట్ ఉంది. చుట్టూ ప్లాస్టిక్ కవర్స్ నీటిలో తేలుతున్నాయి. మరొక చోట ప్రవహించే వాగు వద్ద రష్మిక దీనంగా చూస్తోంది. పరిశుభ్రంగా ఉన్న మరో చెరువులో రష్మిక తనివితీరా స్నానం చేస్తున్నట్లు ఉంది.

కాలుష్యం

నీటి కాలుష్యం గురించి అవేర్నెస్ పెంచేందుకు ఈ ఫోటో షూట్ చేశారు. ఈ ఫోటో షూట్ కు సన్మతి డి ప్రసాద్ క్రియేటివ్ డైరెక్టర్ గా వ్యవహరించారు.  ఇండియాలో అత్యధిక కాలుష్యం ఉన్న చెరువుగా బెల్లందూర్ చెరువు నిలిచింది. పరిస్థితి ఇంత దారుణంగా ఉందని ఈ చెరువు వద్ద షూట్ చేసే వరకు నాకు తెలియదు. ఒకప్పుడు ఈ చెరువు ఎలా ఉండేదో ఊహించుకుంటుంటే నాకు గుండె పగిలింత పని అవుతోంది. ప్రతి చోటా కాలుష్యం ఇలానే ఉంది అంటూ రష్మిక ట్విట్టర్ లో పేర్కొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: