స్టార్ డైరెక్టర్ శంకర్, సూపర్స్టార్ రజనీకాంత్, అక్షయ్కుమార్ల కలయికలో వచ్చిన ‘2.0’ విజువల్ వండర్ క్రియేట్ చేసింది. దేశ వ్యాప్తంగా ఆ మద్య 2.0 మూవీ గురించే చర్చలు కొనసాగాయి. మొదటి నుంచి ఈ సినిమాపై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. బలమైన కథాకథనాలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి శంకర్ అందించిన 2.0 తో అద్భుతం సృష్టించారు. తెలుగు,తమిళ, హిందీ వెర్షన్స్ లో ఈ సినిమా విడుదలైంది. తొలిరోజు నుంచే ఈ సినిమా విజయవిహారం చేయడం మొదలుపెట్టింది.
బాలీవుడ్ లో అయితే ఐదు రోజుల్లొ 120 కోట్లు వసూళ్లు చేసి రికార్డు క్రియేట్ చేసింది. నిన్నటితో 15 రోజులను పూర్తిచేసుకున్న ఈ సినిమా 700 కోట్ల మార్కును చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా తొలివారంలో 526.86 కోట్లను వసూలు చేసిన ఈ సినిమా, రెండవ వారం పూర్తయ్యేనాటికి 710.98 కోట్లను రాబట్టిందని తమిళ సినిమా ట్రేడ్ అనలిస్ట్ మనోబాల తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. రెండు వారాల తర్వాత కూడా అమెరికాలో 2.ఓ వందకు పైగా థియేటర్లలో రన్ అవుతోంది.
ఉత్తర అమెరికాలో ఈ తరహాలో ఎక్కువ రోజులు మరే ఇతర భారతీయ సినిమా ప్రదర్శించలేదట. ఒక్క తమిళనాడులోనే రెండు వారాల్లో 166.98 కోట్లను రాబట్టి, రజనీకాంత్ కెరియర్లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా '2.ఓ' నిలవడం విశేషంగా చెబుతున్నారు. ఇక శంకర్ తన సినిమాలో ఎతో ఒక సోషల్ మెసేజ్ ఇవ్వడం సాంప్రదాయం.. ఈ ప్రపంచం కేవలం మానవాళి కోసమే కాకుండా సమస్త జీవరాశుల కోసం సృష్టించబడిందనే సందేశంతో తెరకెక్కిన ఈ మూవీలో రజనీకాంత్ డాక్టర్ వశీకరణ్, చిట్టి, 2.ఓ, మైక్రోబోట్స్ 3.ఓ వంటి పలు పాత్రల్లో మెప్పించారు.