తమిళ, తెలుగు ప్రేక్షకులకు అజిత్ కుమార్ అంటే ఎంత క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే.  హైదరాబాద్ కి చెందిన అజిత్ తెలుగు లో పెద్దగా సక్సెస్ లోకపోవడంతో కోలీవుడ్ లో స్థిరపడ్డారు.  తమిళనాట రజినీకాంత్ తర్వాత ఆ స్థాయిలో ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించారు.  ఈ మద్య అజిత్ వరుస సక్సెస్ లు సాధిస్తున్నాడు.  ప్రస్తుతం ‘విశ్వాసం’సినిమాలో నటిస్తున్నారు..ఇందులో ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నారు.  అజిత్ సరసన నయనతార నటిస్తుంది.  శివ దర్శకత్వంలో తలా అజిత్ కుమార్ హీరోగా నటిస్తున్న సినిమా విశ్వాసం పై అప్పుడే భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి.  ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నది. 

 సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది.  అజిత్ త‌న త‌ర్వాతి సినిమా పింక్ రీమేక్ లో న‌టించ‌నున్నాడని కొన్నాళ్లుగా జోరుగా ప్రచారం జ‌రుగుతుంది.  తాజాగా ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాలు పూర్తి చేశారు. ధీర‌న్ అధికారం ఒండ్రు చిత్ర ఫేం హెచ్ వినోద్ పింక్ సినిమా త‌మిళంలో రీమేక్ చేయ‌బోతున్నారు.  ఈ సినిమాలో బిగ్ బీ అమితాబచ్చన్, విద్యాబాలన్ గెస్ట్ పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి.  ఫిబ్ర‌వ‌రిలో సినిమా సెట్స్ పైకి తీసుకెళ్ళి, జూన్‌లో రిలీజ్ చేయాల‌ని చిత్ర యూనిట్ భావిస్తుంద‌ట‌. న‌జ్రియా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించ‌నుంద‌ని అంటున్నారు. 
Image result for PINK MOVIE REMAKE
‘పింక్’లో ముఖ్యపాత్రలో అమితాబచ్చన్ నటించారు...ఈ సినిమాలో అబితాబ్ పాత్రలో అజిత్ నటించబోతున్నారట. వీటిపై పూర్తి క్లారిటీ రావ‌ల‌సి ఉంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్‌, గ్లామ‌ర్ బ్యూటీ తాప్సీ న‌టించిన పింక్ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొంద‌డ‌మే కాక ప‌లు అవార్డుల‌ని పొందింది. వ్యభిచార గృహాల్లో చిక్కుకున్న ముగ్గురు యువతులను రక్షించే న్యాయవాది ఇతివృత్తంగా తెరకెక్కిన సినిమా పింక్‌.  


మరింత సమాచారం తెలుసుకోండి: