కేసీయార్ ది గ్రేట్ అన్నారు మొన్ననే  తెలంగాణ ప్రజలంతా. ఆయనకు భారీ విక్టరీ అందించి జేజేలు పలికారు కూడా. ఇక అది మొదలుగా సినిమా వాళ్ళంతా పొలోమంటూ కేసీయర్ జై అంటూ నినాదలు ఇస్తూనే ఉన్నారు. మా అసోసియేషన్ ఏకంగా ఓ తీర్మానమే పాస్ చేసి కేసీయార్ ని కీర్తించింది. సూపర్ స్టార్ క్రిష్ణ, ఆయన తనయుడు మహేష్, రాం చరణ్ ఇలా ఎందరో కేసీయర్ విజయాన్ని అభినందించారు. ఇపుడు ఓ సీనియర్ హీరోయిన్ కేసీయర్ సింహం అంటూ ఓ రేంజిలో పొగిడారు.


వెనకటి తరం హీరోయిన్ జయసుధ కేసీయర్ ని ప్రశంసలతో ముంచెత్తారు. ఆయన గొప్ప నాయకుడు అంటూ కితాబు ఇచ్చారు. తెలంగాణా ఉధ్యమాన్ని ఉవ్వెత్తిన తీసుకెల్లి ప్రత్యేక రాష్ట్రం సాధించిన మేరు నగ ధీరుడంటూ కొనియాడారు. రెండవమారు కేసీయార్ గెలవడాన్ని ఆమె స్వాగతిస్తూ ఎంతో మంది హేమాహేమీలు కాంగ్రెస్ లో ప్రచారం చేసినా కూడా కేసీయర్ గెలవడం గొప్ప విషయమని అన్నారు.


వర్తమాన  రాజకీయాల్లో ఆయన ఒక మహా నాయకుడని, దార్శనీకుడని కూడా జయసుధ అన్నారు. చాలాకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న జయసుధ పనిగట్టుకుని కేసీయార్ ని పొగుడుతున్నారంటే మళ్లీ ఆమె రాజకీయాల్లోకి వస్తారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి ఆమె కనుక వస్తే అది కచ్చితంగా టీయారెస్ పార్టీయే అవుతుందని కూడా అంటున్నారు. చూడాలి ఏం జరుగుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: