మెగా పవర్ స్టార్ రాం చరణ్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న సినిమా వినయ విధేయ రామ. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. రంగస్థలం సినిమా హిట్ తో సూపర్ ఫాం లో ఉన్న రాం చరణ్ ఆ రికార్డులు కొనసాగించేలా వినయ విధేయ రామ తో వస్తున్నాడు.


యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ రేంజ్ లో జరుగుతుంది. నైజాం లో 24 కోట్లు, డిజిటల్, శాటిలైట్ రైట్స్ కలిపి 22 కోట్లు కాగా థియేట్రికల్ బిజినెస్ ఒక్కటే 80 కోట్లు తెచ్చిందట. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ మొత్తం 120 కోట్లు దాకా చేరుకుందని అంటున్నారు. చరణ్ స్టామినా మరోసారి ప్రూవ్ చేసుకోవాల్సిన టైం వచ్చింది.


టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ చూస్తే కచ్చితంగా మళ్లీ చరణ్ రికార్డుల మోత మోగించేలా ఉన్నాడని అంటున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కూడా ఉంటుందని తెలుస్తుంది. ఈ సాంగ్ కోసం బాలీవుడ్ హాట్ బ్యూటీ ఈషా గుప్తాని దించుతున్నారట. దేవి మార్క్ మాస్ బీట్ తో ఈ సాంగ్ ఉంటుందని తెలుస్తుంది. 


చరణ్ తో పాటుగా వివేక్ ఓబేరాయ్ విలన్ గా అదరగొడతాడని అంటున్నారు. సినిమాలో హీరో బ్రదర్స్ గా కోలీవుడ్ ప్రశాంత్, ఆర్యన్ రాజేష్ ఇద్దరు నటిస్తున్నారు. అటు ఫ్యామిలీ ఎమోషన్స్ ఇటు మాస్ ఎలిమెంట్స్ రెండు సమపాళ్లలో ఉండేలా వినయ విధేయ రామ సంక్రాంతి రాజుగా మారేందుకు వస్తున్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: