దీపికా పదుకొనె తానూ ఇష్ట పడ్డ రణ్వీర్ సింగ్ ను పెళ్ళాడి ఇప్పడూ హ్యాపీ గా ఉంది అయితే మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నకు దీపికా విచిత్రంగా మాట్లాడింది . పెళ్లి తర్వాత కూడా దీపిక పదుకోన్ సినిమాల్లో కంటిన్యూ కాబోతున్నారు. అది ఓకే కానీ... చాలా మందిలో ఓ సందేశం ఇంకా అలానే ఉండి పోయింది. వివాహం తర్వాత తెరపై వేరే హీరోలతో ముద్దు సీన్లు చేస్తారా? అనే? ప్రశ్నకు దీపిక విచిత్రంగా రియాక్ట్ అయ్యారు.
తాజాగా ఓ మేగజైన్ ఇంటర్వ్యూలో దీపిక పాల్గొనగా ‘‘పెళ్లి తర్వాత మీరు చేయబోయే సినిమాల కాంట్రాక్టుల్లో నో కిస్సింగ్ క్లాజ్' ఉంటుందా? అనే ప్రశ్న ఎదురైంది. దీనికి వెంటనే ‘ఛీ...' అంటూ రియాక్ట్ అయ్యారు దీపిక. ఆమె రియాక్షన్ చూస్తుంటే ఇకపై ముద్దు సీన్లు చేయబోదని స్పష్టమవుతోంది. రణవీర్, దీపిక పెళ్లి అయింది కానీ... ఇంకా హనీమూన్ వెళ్లలేదు. అందుకు కారణం వారి ప్రొఫెషనల్ కమిట్మెంట్సే. ఈ విషయమై దీపికను ప్రశ్నించగా... ప్రస్తుతం రణవీర్ ప్రొఫెషన్ పరంగా బిజీగా ఉండటతో ఇంకా దాని గురించి ఆలోచించలేదని, త్వరలోనే ప్లాన్ చేసుకుంటామని తెలిపారు.
రణవీర్ సింగ్ ప్రస్తుతం రోహిత్ శెట్టి దర్శకత్వంలో నటించిన ‘సింబా' మూవీకి సంబంధించిన ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం డిసెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా విడుదల తర్వాత రణవీర్, దీపిక హనిమూన్ వెళ్లే అవకాశం ఉంది. దీపిక పదుకోన్ త్వరలో మేఘనా గుల్జార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రంలో నటించబోతోంది. యాసిడ్ ఎటాక్కు గురైన లక్ష్మి అగర్వాల్ జీవితంగా ఆధారంగా ఈ సినిమా ఉండబోతోంది. ఈ చిత్రం ద్వారా దీపిక నిర్మాతగా మారుతుండటం విశేషం.