ప్రభాస్-అనుష్క అనగానే ఒక భావాతీతమైన ప్రేమ జంట గుర్తుకు రావటం ఖాయం. భారతీయ వెండి తెరపై అధ్బుతంగా విలసిల్లే మోస్ట్ పాపులర్ ప్రేమ జంటల్లో వీరి దెప్పుడూ మొదటి స్థానమే. డార్లింగ్ ప్రభాస్ తో స్వీటీ అనుష్క - బిల్లా, మిర్చి, బాహుబలి, బాహుబలి-2 చిత్రాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా బాహుబలి-2 చిత్రంలో ఈ జంట జనాన్ని రంజించిన తీరుకు ముచ్చట పడనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు.
దాదాపుగా ఒక దశాభ్దం పాటు వీళ్ళు కలసి స్క్రీన్ ను పంచుకొని నటించిన ఈ నేపథ్యంలోనే ప్రభాస్, అనుష్క ప్రేమలో ఉన్నారని త్వరలో పెళ్లి చేసుకోవాలని అనుకుంటు న్నారని సోషల్ మీడియాలో భారీగానే ప్రచారం జరిగింది. అయితే దీనిపై అటు ప్రభాస్ ఇటు అనుష్క షెట్టి కుటుంబాల నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. వీరువురు తమ మద్య స్నెహాన్ని మించిన ఎలాంటి సంభందం లేదంటూ పలు సందర్భాల్లో ఖండించారు కూడా!
"భాగమతి" లాంటి తర్వాత అనుష్క నుంచి తెలుగులో మరే సినిమా రాలేదు. బాహుబలి-2 తరవాత ప్రభాస్, సుజిత్ వర్మ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బానర్ పై తెర కెక్కుతున్న "సాహో"లో నటిస్తున్నాడు. దీని తర్వాత "జిల్" ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో నటించనున్నాడు. ఇందులో పూజా హెగ్దే ప్రధాన కథానాయిక. అసలు విషయం ఏంటంటే ఈ చిత్రంలో అనుష్క ఒక కీలక పాత్రలో నటించనుందట. ప్రభాస్ తో రొమాన్స్ సన్నివేశాలు కూడా ఉంటాయట. ప్రస్తుతం ఈ వార్త అంతర్జాలంలో వైరల్ గా మారింది.
వీరిద్దరి కాంబినేషన్ మరోసారి సినిమా వస్తుందని అదీ కూడా సూపర్-హిట్ అవుతుందని ప్రభాస్ అభిమానులు ఇప్పుడే ఖుషీ ఖుషీ అయిపోతున్నారు. దీనిపై యూవీ క్రియేషన్స్ యూనిట్ మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన కూడా చేయలేదు.