యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, క్రేజీ బ్యూటీ అనుష్కల మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ మీడియా కోడై కూస్తుంది. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన ప్రభాస్ తనకు సరిజోడీ అయిన అనుష్కతో పెళ్లికి సిద్ధమయ్యాడని కొన్నాళ్లుగా వినిపిస్తున్న వార్తే. అయితే మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి వారిద్దరు మామధ్య అలాంటిదేమి లేదని చెబుండేవారు.
అయితే ఇప్పుడు మళ్లీ ఇద్దరు కలిసి నటించబోతున్న వార్త సంచలనం రేపుతుంది. కలిసి నటిస్తే ఈ రూమర్స్ మరి ఎక్కువయ్యే అవకాశం ఉందని.. ఇక మీదట ప్రభాస్ తో అనుష్క నటించడం కష్టమని అనుకున్నారు. కాని ప్రభాస్, అనుష్క మళ్లీ రొమాన్స్ కు రెడీ అవుతున్నారు. సాహో తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమాలో అనుష్క నటిస్తుందని తెలుస్తుంది.
జిల్ ఫేం రాధాకృష్ణ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఇప్పటికే పూజా హెగ్దె హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది. అయితే సినిమాలో సెకండ్ హీరోయిన్ కూడా అవసరం ఉండగా స్వీటీ అనుక్షను సెలెక్ట్ చేశారట. అనుష్క కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తుంది. అయితే అఫిషియల్ గా చెప్పడమే లేటని అంటున్నారు.
యువి క్రియేషన్స్ బ్యానర్ లో వస్తున్న సాహో సినిమా 2019 ఆగష్టులో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇక 2019 మిడిల్ లో రాధాకృష్ణ సినిమా మొదలవుతుందట. ఈ సినిమా మొత్తం ఫారిన్ బ్యాక్ డ్రాప్ తో సినిమా ఉంటుందని తెలుస్తుంది. యువి ఆస్థాన డైరక్టర్స్ తోనే సినిమాలు చేస్తున్న ప్రభాస్ రాబోతున్న సినిమాలతో ఎలాంటి ఫలితాలను అందుకుంటాడో చూడాలి.