ఒక హీరో సినిమా విడుదల అవుతోంది అంటే ఆమూవీ విడుదల ముందు వివిధ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ హడావిడి చేయడం హీరోల అలవాటు. ముఖ్యంగా ఈవిషయం టాప్ హీరోలకు బాగా వర్తిస్తుంది. అయితే ఈవారం విడుదల కాబోతున్న అంతరిక్షం మూవీని ఏ మాత్రం ప్రోమోట్ చేయకుండా వరుణ్ తేజ్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. 
అత్యున్న‌త సాంకేతిక ప‌రిజ్ఞానంతో
తెలుస్తున్న సమాచారం మేరకు వరుణ్ తేజ్ ప్రస్తుతం ముంబాయిలో తన లేటెస్ట్ సినిమా లుక్ కోసం ఒక ప్రముఖ స్టైలిస్ట్ తో చర్చలు జరుపుతున్నట్లు టాక్. రేపు భాగ్యనగరంలో జరగబోతున్న అంతరిక్షం ప్రీ రిలీజ్ ఫంక్షన్ సమయానికి వరుణ్ తేజ్ హైదరాబాద్ కు వచ్చినా కేవలం మిగిలి ఉన్న ఆ మూడు రోజులలో వరుణ్ తేజ్ ‘అంతరిక్షం’ ను ఏస్థాయిలో ప్రమోట్ చేయగలడు అన్న కామెంట్స్ వస్తున్నాయి. 
డిసెంబ‌ర్ 21న అంతరిక్షం
దీనికితోడు సంకల్ప రెడ్డి దర్శకత్వం వహించిన ఈమూవీ పై పాజిటివ్ టాక్ ఉన్నా ఎంతవరకు ఈసినిమా సాధారణ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థుతులలో ఈసినిమాకు అత్యంత భారీ ప్రమోషన్ అవసరం. అయితే ఈవిషయంలో ఈమూవీ ఇప్పటికే వెనకపడింది అన్న కామెంట్స్ వస్తున్నాయి.
న‌టీన‌టులు, సాంకేతిక విభాగం
ఇది ఇలా ఉండగా వరుణ్ తేజ్ మూవీతో పోటీగా విడుదల అవుతున్న శర్వానంద్ ‘పడిపడి లేచె మనసు’ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు అతిధిగా అల్లు అర్జున్ రాబోతున్నాడు. దీనితో వరుణ్ తేజ్ ‘అంతరిక్షం’ ఫంక్షన్ కు చరణ్ శర్వానంద్ మూవీ ఫంక్షన్ కు బన్నీ అతిధులుగా వస్తూ ఉండటంతో ఈ ఇద్దరు టాప్ యంగ్ హీరోల ప్రమోషన్ లో ఎవరిది పై చేయి అన్న ఆసక్తి కూడా అందరిలో బాగా పెరిగిపోయింది..  


మరింత సమాచారం తెలుసుకోండి: