టాప్ హీరోలను పక్కకుపెడితే   టాలీవుడ్ యంగ్ హీరోల మార్కెట్ అంతంత మాత్రంగానే ఉంది. ఒక్క విజయ్ దేవరకొండను మినహాయిస్తే మిగితా యంగ్ హీరోల మార్కెట్  ముఫై నుంచి ముఫై అయిదుకోట్లలోపే ఉంటోంది. ఇలాంటి పరిస్థితులలో చాలామంది నిర్మాతలు తాము యంగ్ హీరోలతో తీసే సినిమాల విషయంలో 25 కోట్ల వరకు పెట్టుబడి పెడుతున్నారు కానీ అంతకు మించి ఆయంగ్ హీరోల పై పెట్టుబడి పెట్టడానికి నిర్మాతలు ముందుకు రారావడం లేదు. 
Sharwanand Padi Padi Leche Manasu Movie First Look ULTRA HD Posters WallPapers
ఇలాంటి పరిస్థుతులలో ఈవారం విడుదల కాబోతున్న శర్వానంద్ లేటెస్ట్ మూవీ ‘పడి పడి లేచె మనసు’ సినిమాకు ముప్పై కోట్ల పెట్టుబడి దాటినట్లు వార్తలు వస్తున్నాయి. వడ్డీలు పబ్లిసిటీ అన్నీ లెక్క వేసుకుంటే దాదాపు నలభై కోట్ల వరకు లెక్క తేలిందని సమాచారం. ముఖ్యంగా ఈసినిమా కోసం వేసిన ఒక భారీ సెట్ తో పాటు కథలో రెండు విభిన్న భాగాలు ఉండటం మధ్యలో ఈమూవీ రీషూట్ చేయడంతో ఇలా ఖర్చు పెరిగిపోయింది అని అంటున్నారు.

దీనితో ఈసినిమా నిర్మాతలకు లాభాలు రావాలి అంటే ఈమూవీకి 45 కోట్లు కలక్షన్స్ రావలసిన పరిస్థితి ఏర్పందింది. అయితే ఈమధ్య శర్వానంద్ మార్కెట్ అంతగా బాగుండగ పోవడంతో ఈమూవీ నిర్మాతలు బయ్యర్లు అంతా సాయి పల్లవి క్రేజ్ పైన మాత్రమే ఆధారపడ్డారు. అయితే అనూహ్యంగా ఈసినిమాకు సాయి పల్లవి సమస్యగా మారడం హాట్ టాపిక్ గా మారింది.  
Padi Padi Leche Manasu,Padi Padi Leche Manasu first look,Padi Padi Leche Manasu first look pics
ఇప్పటికే ఈసినిమాకు అనేక సినిమాలతో పోటీ ఉంటే అనుకోకుండా తమిళ హీరో ధనుష్ నటించిన తెలుగు డబ్బింగ్ ‘మారి 2’ ను కూడ ఇదే వారం విడుదల చేస్తున్నారు. ఈమూవీలో కూడ సాయి పల్లవి హీరోయిన్. ఈమూవీలో సాయిపల్లవి నటన ఒక రేంజ్ హుషారుగా ఉంటుందని సమాచారం. అయితే ‘పడి పడి లేచెమనసు’ సినిమాలో మాత్రం సాయి పల్లవి కాస్త సీరియస్ రోల్ చేసినట్లు టాక్. దీనితో సాయి పల్లవి నటించిన ఒక సినిమా పై మరొక సినిమా పోటీగా విడుదల అవుతూ ఉండటంతో ఆ సమస్య ఇప్పుడు శర్వానంద్ కు పెను సమస్యగా మారుతుందా అంటూ కొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: