ఈ మద్య స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే కాకుండా చిన్న హీరోల సినిమాలకు సైతం ముఖ్య అతిథిలుగా స్టార్ హీరోలు రావడం సందడి చేయడం జరుగుతుంది. టాలీవుడ్ లో గత కొంత కాలంగా వరుస విజయాలతో దూసుకు పోతున్నాడు శర్వానంద్. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్ ఫిదా పేమ్ సాయి పల్లవి జంటగా నటిస్తున్న సినిమా ‘పడి పడి లేచె మనసు’.
ప్రేమకథా చిత్రాలను తెరకెక్కించడంలో హను రాఘవపూడి ఇప్పటికే తన ప్రత్యేకతను చాటుకున్నాడు. శర్వానంద్, సాయిపల్లవి జంటగా నటించిన ఈ సినిమా 21న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన సాంగ్స్, టీజర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సన్నాహాలు జరుగుతున్నాయి.ఈ రోజు సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకి హైదరాబాద్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ విచ్చేయుచున్నారు.
అయితే శర్వానంద్ తో అల్లు అర్జున్ కి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కాగా, ఈ ఈవెంట్ కి ఆహ్వానించగానే అల్లు అర్జున్ అంగీకరించడం పట్ల దర్శకుడు హను రాఘవపూడి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ .. ఆయనకి ధన్యవాదాలు తెలియజేశాడు. ఆ మద్య యూత్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ నటించిన గీతాగోవిందం, టాక్సీవాలా సినిమాలకు సంబంధించిన కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా అల్లు అర్జున్ సందడి చేశాడు.
తాజాగా ‘పడి పడి లేచె మనసు’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి అల్లు అర్జున్ రావడం చిత్ర యూనిట్ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా టీజర్ కి .. సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలసిందే. ముఖ్యంగా టైటిల్ సాంగ్ జనంలోకి బాగా వెళ్లింది. ఈ సినిమా తప్పకుండా సక్సెస్ ను సాధిస్తుందనే నమ్మకంతో టీమ్ వుంది.