సాయిపల్లవి. పక్కింటి అమ్మాయిలా ఉంటూనే యూత్ ని ఫిదా చేసేస్తుంది. అందం కంటే ఆకర్షణ ఎక్కువగా ఉన్న ఈ అమ్మడు సినిమాలు సెలెక్టివ్ గా చేసినా ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఓ రేంజిలో ఉంది. ఆమె హీరోయిన్ గా ఉంటే చాలు ఆ మూవీ హిట్ అన్న స్థాయికి సాయి పల్లవి చేరుకుంది. అల్లరి కళ్ళతో అలజడి పుట్టించడం ఆమెకే తెలుసు. సాయి పల్లవి సింపుల్ అండ్ స్వీట్ అందుకే మాకు ఆమె అంటే ఇష్టమని అభిమానులు చెబుతారు. ఇపుడు అలాటి అభిమానులకు సాయి పల్లవి ఓ పరీక్ష పెడుతోంది.


సాయి పల్లవి నటించిన రెండు మూవీస్ డిసెంబర్ 21న   ఒకే రోజు విడుదల అవుతున్నాయి. అందులో ఓకటి తెలుగులో స్ట్రైట్ మూవీ అయితే, రెండవది తమిళ్ దబ్బింగ్. ఈ రెండు మూవీస్ మీద మంచి అంచనాలే ఉన్నాయి. తెలుగులో సాయి పల్లవి శర్వానంద్ జంటగా నటించిన పడి పడి లేచే మనసు మూవీ తో పాటు తమిళ్ హీరో ధనుష్ హీరోగా సాయి పల్లవి జోడీతో వస్తున్న మూవీ మారీ 2. ఈ మూవీకి కూడా పాజిటివ్ బజ్ ఉంది. ఈ రెండు మూవీస్ ఒకేమారు థియేటర్లలోకి వస్తే దేనికి క్రేజ్ ఎక్కువగా ఉంటుందన్నది ఇపుడు టాలీవుడ్ లో చర్చగా ఉంది.


పడి పడి లేచే మనసు మూవీలో సాయి పల్లవి కీ రోల్ ప్లే చేసింది. ఆమెను చూసే మూవీని వెళ్ళాలని అనుకునేంతలా ఆమె పాత్ర ఉంటుందట. ఇక మారి 2 లో హుషారైన పాత్రలో సాయి పల్లవి కనిపిస్తుంది. ఈ రెండు మూవీస్ పోటీ అనుకుంటే పడి పడి లేచె మనసు మూవీకి కలెక్షన్లు తగ్గిపోతాయేమోనని ఆ మూవీ మేకర్స్ ఇపుడు కంగారు పడుతున్నారు. ఆ మధ్యన సాయి పల్లవితో  మరో మారు రీ షూట్ చేయించి మరీ చాలా జాగ్రత్తగా మూవీలో ఆమె పాత్రను డిజైన్ చేశారు. ఇపుడు మాయల మారి లా మారీ 2 వచ్చి పడిందని వాపోతున్నారు. ఇక మరో మూవీ అంతరిక్షం  కూడా ఆ రోజే వస్తోంది. మరి ఏది హిట్టో, మరేది వెనకబడుతుందో ప్రేక్షకులే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: