తమిళనాట సూపర్ స్టార్ రజినీకాంత్ కి మాస్ ఫాలోయింగ్ ఎంతో ఉంది..ఆ స్థాయిలో మాస్ ఇమేజ్ తెచ్చుకున్న హీరో ఆయన అల్లుడు ధనుష్. ఇప్పటి వరకు ధనుష్ నటించిన సినిమాలు చాలా వరకు మాస్ ఆడియన్స్ ని మెప్పించినవే...ఆయన సినిమాలు చాలా నేచురల్ గా ఉంటాయి. రజినీకాంత్ ఇమేజ్ ఏ మాత్రం వాడుకోకుండా నటున, దర్శకత్వం, నిర్మాత, సింగర్ గా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించారు ధనుష్. తాను హీరోగా నటించిన ‘3’ సినిమాలో ధనుశ్ పాడిన ‘వై దిస్ కొలవెరి..’ సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే.
ఆ తర్వాత కూడా కొన్నిసార్లు ధనుష్ కొన్ని పాటలు పాడారు. ఒక వైపున హీరోగా .. మరో వైపున నిర్మాతగా ఆయన కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు వెళుతున్నాడు. ఆయన తాజా సినిమా ప్రేక్షకులను పలకరించడానికి 'మారి 2' సిద్ధమవుతోంది. గతంలో ఘనవిజయాన్ని సాధించిన 'మారి'కి ఇది సీక్వెల్. ఈ సినిమాలో ఆయన జోడీగా సాయిపల్లవి కనిపించనుంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ నెల 21వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.
ఇదే సమయంలో శర్వానంద్, సాయిపల్లవి నటించిన 'పడి పడిలేచె మనసు' కూడా అదే రోజున థియేటర్లకు రానుంది. సాయిపల్లవి చేసిన రెండు సినిమాలు ఒకే రోజున థియేటర్లకు వస్తున్నాయన్నాయి. ఇక సింగర్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ధనుష్ తాజాగా డైరెక్టర్ వసంతబాలన్ దర్శకత్వంలో రూపొందిన ‘జైలు’ సినిమా కోసం సాంగ్ పాడారు.‘జైలు’ సినిమాలో హీరోగా నటించిన సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్కుమార్ ఈ విషయం తెలిపారు. ఇందులో ‘రౌడీ బేబీ..’ అనే సాంగ్ను తెలుగులో ధనుశ్ పాడారు. తమిళంతో పాటు తెలుగులోను అదే రోజున తన సినిమా రావలసిందేనని అంటున్నాడట ధనుష్. ఇక ఇదే రోజున వరుణ్ తేజ్ 'అంతరిక్షం'కూడా విడుదలవుతోన్న సంగతి తెలిసిందే.