యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత చేస్తున్న సినిమా సాహో. సుజిత్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా యువి క్రియేషన్స్ బ్యానర్ లో 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఈ సినిమా నుండి ఈమధ్య వచ్చిన మేకింగ్ వీడియో సినిమా మీద అంచనాలు మరింత పెంచింది. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ తెలుగు, తమిళ, హింది భాషల్లో రిలీజ్ చేయబోతున్నారట.


ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో కొందరు 2019 సమ్మర్ అని అనగా.. మరికొందరు ఆగష్టులో సాహో రిలీజ్ అంటున్నారు. అయితే ఎక్స్ క్లూజివ్ రిపోర్ట్స్ ప్రకారం సాహో సినిమా ఆగష్టు 15న రిలీజ్ ఫిక్స్ చేశారట. ఆ ప్రకారంగా షెడ్యూల్ ప్లాన్ చేశారట. ప్రస్తుతం 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న సాహో మూవీ త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తుందట.


శంకర్ ఎహసన్ లాయ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. ముఖ్యంగా ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ప్రభాస్ ఫ్యాన్స్ ను మాత్రమే కాదు సిని ప్రేమికులకు తెగ నచ్చేస్తాయట. స్కై ఫైట్స్ తో కూడా యాక్షన్ సీన్స్ హైలెట్ గా నిలుస్తాయని అంటున్నారు. అబుదాబిలో ఫైట్ సీన్ కూడా సినిమాకు ప్లస్ అవుతుందట.


బాహుబలి తర్వాత ఆ అంచనాలకు తగినట్టుగానే సాహో సిద్ధం అవుతుంది. రన్ రాజా రన్ సినిమాతో దర్శకుడిగా తానేంటో ప్రూవ్ చేసుకున్న సుజిత్ ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటనున్నాడని తెలుస్తుంది. మరి ఈ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: