సూపర్ స్టార్ మహేష్ భరత్ అనే నేను సినిమా తర్వాత వంశీ పైడిపల్లి డైరక్షన్ లో మహర్షి సినిమా చేస్తున్నాడు. 2019 ఏప్రిల్ 5న రిలీజ్ ఫిక్స్ చేసిన ఈ సినిమాను దిల్ రాజు, అశ్వనిదత్ లు కలిసి నిర్మిస్తున్నారు. టాలీవుడ్ క్రేజీ బ్యూటీ పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడని తెలిసిందే.


సినిమాలో మహేష్, నరేష్ ల మధ్య వచ్చే సీన్స్ మనసులను గెలుస్తాయని చెబుతున్నారు. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ 26వ సినిమా సుకుమార్ డైరక్షన్ లో ఫిక్స్ అయ్యింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రాబోతున్న ఈ సినిమా కథ విషయంలో సుకుమార్, మహేష్ ఓ ఫైనల్ నిర్ణయానికి వచ్చారని ఫిల్మ్ నగర్ టాక్.


రంగస్థలం సక్సెస్ తో సూపర్ ఫాంలో ఉన్న సుకుమార్ మహేష్ కోసం కూడా ఓ తెలంగాణా బ్యాక్ డ్రాప్ కథతో వచ్చాడట. అయితే ఆ స్టోరీ వద్దని చెప్పాడు మహేష్. ఇక మహేష్ ను మెప్పించే కథ కోసం ఇన్నాళ్లు టైం తీసుకున్న సుకుమార్ ఓ క్రైం థ్రిల్లర్ పాయింట్ తో మళ్లీ మహేష్ ను కలిశాడట. ఈసారి మహేష్ కు లైన్ నచ్చేసిందని తెలుస్తుంది.  


మహేష్, సుకుమార్ ఆల్రెడీ 1 నేనొక్కడినే సినిమా చేశారు. ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. అయితే మహేష్ కు హిట్టు బాకీ ఉందని ఎప్పుడు చెప్పే సుకుమార్ ఈసారి ఆ బాకీ తీర్చుకునే సూపర్ డూపర్ హిట్ ఇస్తాడని నమ్ముతున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. మహర్షి సినిమా రిలీజ్ తర్వాత సుకుమార్ మూవీ మొదలవుతుందట. 



మరింత సమాచారం తెలుసుకోండి: