టైమ్ చూసి సరైన టైమింగ్ తో ఘాటైన సెటైర్లు వేయడం అల్లు అర్జున్ కు అలవాటు. అటువంటి సందర్భమే నిన్న జరిగిన శర్వానంద్ ‘పడి పడి లేచే మనసు’ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో జరిగింది. శర్వానంద్ అభిమానుల కన్నా అల్లు అర్జున్ అభిమానులు పవన్ అభిమానులు ఎక్కువగా హాజరు అయినఈ ఫంక్షన్ లో బన్నీ ఏకంగా అభిమానులకు క్లాసు పీకడం హాట్ టాపిక్ గా మారింది. 
Image result for padi padi leche manasu pre release event
అయితే నిన్నటి ఫంక్షన్ లో అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ యధాలాపంగా వచ్చినవి కావు. ఎప్పటి నుంచో అల్లు అర్జున్ గుండెల్లో రగులుతున్నమాటలు నిన్నటి ఫంక్షన్ లో బయటకు వచ్చి ఉంటాయి అన్న కామెంట్స్ వస్తున్నాయి. ఆసక్తికరమైన  ఈన్యూస్ విరాలలోకి వెళ్ళితే నిన్నటి కార్యక్రమానికి వచ్చిన అభిమానులలో ఒక వ్యక్తి  ‘రేయ్.. చిరంజీవి’ అంటూ పిలిచాడు. 
Image result for padi padi leche manasu pre release event
ఈ పిలుపు బన్నీ చెవిలో పడటంతో జనం వైపు చూస్తూ ‘ఆ పిలుపేంట్రా.. చిరంజీవి గారు..అనండీ’ పద్ధతి నేర్చుకోండి అంటూ సెటైర్ వేసాడు. అంతేకాదు ‘పవన్ కల్యాణ్ గారు అని పిలవాలి, పొలిటీషియన్ అయినంత మాత్రాన మీకెవరికీ హక్కు ఇవ్వలేదు, తక్కువ చేసి మాట్లాడకూడదు వినడానికి  గౌరవంగా ఉండాలి ఇప్పటి కైనా నేర్చుకోండి’ అంటూ మరో సెటైర్ పేల్చాడు. 

దీనితో ఈ కార్యక్రమానికి వచ్చిన చాలామంది అల్లు అర్జున్ మాటతీరును చూసి ఆశ్చర్యపోయారు. దీనికితోడు బన్నీ తన స్నేహితుడైన శర్వానంద్ ను ‘గారు’ అంటూ ఒకటికి పదిసార్లు సంభోధించడం నిన్నటి ఈవెంట్ కు హైలెట్. అంతేకాదు నిన్నటి ఫంక్షన్ లో అల్లు అర్జున్ ఆకార్యక్రమానికి వచ్చిన ప్రతి చిన్న ఆర్టిస్ట్ ను మితిమీరిన గౌరవంతో ‘గారు’ అంటూ సంభోధించడంతో అల్లు అర్జున్ తనను అందరూ బన్నీ అని కాకుండా ‘అల్లు అర్జున్ గారు’ అని గౌరవంతో పిలవండి అంటూ పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్లు అయిందని ఈ కార్యక్రమానికి వచ్చిన చాలామంది కామెంట్స్ చేసుకున్నట్లు టాక్..  



మరింత సమాచారం తెలుసుకోండి: