టాలీవుడ్ లో నందమూరి హీరో కళ్యాన్ రామ్ నిర్మాతగ, నటుడిగా రాణిస్తున్నారు.  ఆ మద్య ‘ఫటాస్’సినిమాతో ఘన విజయం అందుకున్న కళ్యాన్ రామ్ కొంత కాలంగా మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నారు.  అయితే నిర్మాతగా ‘జై లవకుశ’సినిమాతో మంచి సక్సెస్ పొందాడు.  ప్రస్తుతం కళ్యాన్ రామ్ హీరోగా గుహన్ దర్శకత్వంలో '118' సినిమా రూపొంతుంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. జనవరిలో ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో వున్నారు.  మహేష్ కోనేరు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన నివేదా థామస్, షాలిని పాండే హీరోయిన్లుగా నటిస్తున్నారు.

తాజాగా ‘118’సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు.  కల్యాణ్ రామ్, షాలినీ పాండేకి సంబంధించిన విజువల్స్ పైనే ఈ టీజర్ ను కట్ చేశారు.  మొదట సంతోషకరమైన జీవితాన్ని అనుభవించడం.. ఆ తరువాత అనూహ్యమైన సంఘటనలను ఫేస్ చేయడం ఈ టీజర్ లో కనిపిస్తోంది.   ట్విస్ట్ ఏంటంటే..మరో హీరోయిన్  నివేదా థామస్ రోల్ ను ఎక్కడా రివిల్ చేయలేదు. అంతే కాదు ఈ టీజర్ అంతా కూడా సస్పెన్స్ నే ఎక్కువగా మెయింటేన్ చేసినట్లు కనిపిస్తుంది. 

టైటిల్ కి తగినట్టుగానే విజువల్స్ కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.  ఇక ఈ టీజర్ లో కళ్యాన్ రామ్ కూడా న్యూ లుక్ తో డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. అయితే అఖిల్ అక్కినేని హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై ‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో భారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న యూత్‌పుల్ ఎంటర్‌టైనర్ “మిస్టర్ మజ్ను”.

అఖిల్ “మిస్టర్ మజ్ను” జనవరి 25న విడుదల కాబోతోంది కాబట్టి, తన సినిమాను పోస్ట్ పోన్ చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు టాక్ వచ్చింది. గత కొంత కాలంగా ఈ ఇద్దరు హీరోలకు సరైన హిట్ లేక పోవడంతో ఒకేసారి బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగితే ఓపెనింగ్స్ పై ప్రభావం పడే అవకాశం ఉందని భావిస్తున్నారట. అయితే ‘118’పై మరిన్ని అప్ డేట్స్ రావాల్సి ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: