తెలుగు ఇండస్ట్రీలో కామెడీ నటుడిగా ఎంట్రీ ఇచ్చిన బండ్ల గణేష్ ఎన్నో చిత్రాల్తో తనదైన కామెడీ మార్క్ చాటుకున్నారు.  ఆ తర్వాత అనుకోకుండా నిర్మాతగా మారి స్టార్ హీరోల చిత్రాలు నిర్మించారు.  ప్రస్తుతం రాజకీయాల్లోకి అడుగు పెట్టిన బండ్ల గణేష్ ఆ మద్య కాంగ్రెస్ తరుపు నుంచి అధికార పార్టీపై ఎన్నో విమర్శలు చేశారు.  అంతే కాదు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే బ్లేడ్ తో పీకకోసుకుంటానంటూ సవాలు విసిరి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. ఇక తెలుగు, తమిళ ఇండస్ట్రీలో శృంగార తారగా పేరు తెచ్చుకున్న నటి రమ్య,  బండ్ల గణేష్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.
Image result for tollywood vamp actress ramya
నటి రమ్య మాట్లాడుతూ..బండ్ల గణేష్ ఇండస్ట్రీలో ఒక నిర్మాతగా తెలుసునని..ఆయనకు రాజకీయాల పై ఎలాంటి అవగాహన లేకుండానే ఎంట్రీ ఇచ్చారని.. కాంగ్రెస్ పార్టీ అనవసరంగా ఆయనను ఎంట్రటైన్ చేస్తుందని..ఇలాంటి వారి వల్ల పార్టీకి అప్రతిష్ట కలుగుతుందని అన్నారు.  ఇప్పటి వరకు ఆయనతో నాకు ఎలాంటి విభేదాలు లేవని..ఈ రోజు ఆయన గురించి మాట్లాడుతున్నానంటే..ఆయన వ్యవహారం చూస్తుంటే ఎవ్వరికైనా జుగుప్స కలుగుతుందని అన్నారు. 
Image result for bandla ganesh
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి గొప్ప నాయకుల గురించి ఇష్టమొచ్చినట్లు నోరు పారేసుకుంటే ఏ ఆడపిల్ల అయినా ఇలాగే మాట్లాడుతుంది. ఇలాంటి పిచ్చి కుక్కల్ని ప్రజలే కొట్టి చంపేయాలి… రాజకీయాల్లో ప్రోత్సహించకండి. అంతే కాదు ఎన్నికల ముందు ఆయన పిచ్చి ప్రేలాపణ చేసిన విషయం తెలిసిందే..కాంగ్రెస్ గెలవకపోతే బ్లేడ్ తో పీక కోసుకుంటా అని ఛాలెంజ్ చేశారుగా మరి ఆ మాట మీద నిలబడితే ఆయన మాటలకు విలువ ఉంటుందని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: