ఈ మద్య వరుసగా బయోపిక్ సినిమాలు వస్తున్న విషయం తెలిసిందే. సినీ నేపథ్యంలో అలనాటి మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్విన్ డైరక్షన్ లో కీర్తి సురేష్ నటించిన ‘మహానటి’ సినిమా మంచి సక్సెస్ సాధించింది.  ప్రస్తుతం సినీ, రాజకీయ నేపథ్యంలో సినిమాలు రూపొందుతున్నాయి.  క్రిష్ డైరెక్షన్ లో బాలకృష్ణ హీరోగా ‘ఎన్టీఆర్’బయోపిక్ తీస్తున్న విషయం తెలిసిందే.  ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయినట్లే..త్వరలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా చేయబోతున్నారు. 
Related image
ఇక దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా ‘ఆనందో బ్రహ్మ’ఫేమ్ మహి వి రాఘవ్ తెరకెక్కిస్తున్నాడు.  ఈ సినిమాలో రాజశేఖర్ రెడ్డి పాద యాత్ర గురించి ఎక్కువగా చూపించబోతున్నారట.  వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష హోదాలో ఉన్న ఆయన పాద యాత్ర ద్వారా ప్రజల మనసు దోచారరు.  అందుకే ఆయన వరుసగా రెండు సార్లు సీఎం పీఠం ఎక్కారు.  ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, ఫస్ట్ టీజర్..సాంగ్స్ సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యాయి.

డిసెంబర్ 21న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్బంగా ‘యాత్ర’టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.  70ఎమ్ ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంఫై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కృష్ణ కుమార్ సంగీతం అందిస్తున్నారు.  ఈ సినిమా లో జగపతి బాబు , సుహాసిని , అనసూయ , రావు రమేష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.  కాగా, ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న తెలుగు తోపాటు మలయాళం, తమిళ భాషల్లో విడుదలకానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: