ఈ మద్య కొంత మంది హీరోలు సూపర్ హిట్ చిత్రాలు ఇట్టే మిస్ చేసుకొని తర్వాత మంచి చాన్స్ మిస్సయ్యామే అని బాధపడుతున్నారు. కానీ యంగ్ హీరో శర్వానంద్ మాత్రం ఇందుకు వ్యతిరేకంగా ఉన్నాడు. తాజాగా శర్వానంద్, సాయి పల్లవి కాంబినేషన్ లో హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘పడి పడి లేచే మనసు’ 21న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. అర్జున్ రెడ్డి వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తీసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో చిత్రాన్ని చేసేందుకు సిద్ధంగా లేనని చెప్పాడు శర్వానంద్.
అసలు విషయానికి వస్తే..సందీప్ వంగా మొదట ‘అర్జున్ రెడ్డి’చిత్రం స్టోరి శర్వానంద్ కే వినిపించాడట..కానీ ఆ చిత్రం హీరో క్యారెక్టర్ బోల్డ్ గా ఉండటంతో తాను సరిపోనని సున్నితంగా తిరస్కరించారట. దాంతో ఆ చిత్రం విజయ్ దేవరకొండతో కంప్లీట్ చేసి ఘన విజయాన్ని అందుకున్నాడు సందీప్ వంగా.
ఆ తర్వాత మరో కథతో శర్వానంద్ వద్దకు వెళ్తే..ఆ చిత్రానికి కూడా నో చెప్పాడట. అయితే తాను ప్రస్తుతం ప్రేమ కథ, ఫ్యామిలీ చిత్రాలు మాత్రమే చేస్తానని..కథ నచ్చకపోతే ఏ చిత్రం చేయలేనని అంటున్నాడట. ఈ నెల 21 న రిలీజ్ కాబోయే ‘పడి పడి లేచే మనసు’సున్నితమై ప్రేమ కథగా రూపొందించారు.