తమిళనాట మాస్ హీరోగా మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నాడు ధనుష్. సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడైన ధనుష్ తన మామ ఇమేజ్ ఏమాత్రం ఉపయోగించుకోకుండా తన స్వశక్తితో హీరోగా పైకి వస్తున్నాడు. కేవలం హీరోగానే కాకుండా దర్శకుడిగా..నిర్మాతగా తన సత్తా చాటుతున్నాడు. అంతే కాదు ‘కొలవెరి’సాంగ్ తో సింగర్ గా కోట్ల మంది ప్రేక్షకుల అభిమానం పొందారు.
పలు సినిమాల్లో సింగర్ తన గొంతు వినిపిస్తునే ఉన్నారు. బాలాజీ మోహన్ దర్శకత్వంలో ధనుష్, సాయిపల్లవి జంటగా ‘మారి 2’సినిమా రూపొందింది. ఈ సినిమా ధనుష్ సొంత బ్యానర్లో నిర్మించారు. ఈ నెల 21వ తేదీన తెలుగు, తమిళంలో ఒకేసారి రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ సినిమా, యు/ఎ సర్టిఫికెట్ ను సంపాదించుకుంది.
గతంలో మారి సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమా సీక్వెల్ తెరకెక్కించారు. ధనుష్ నటించిన సినిమాలు చాలా వరకు తెలుగు లో రిలీజ్ అవుతున్నాయి..కొన్ని సినిమాలో మంచి సక్సెస్ కూడా సాధించాయి. ఆ మద్య ధనుష్ నటించిన 'రఘువరన్ బీటెక్' ఘన విజయం అందుకుంది.
ఈ నెల 21 న పడి పడి లేచే మనసు, అంతరిక్షం, కేజిఎఫ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే ఈ సినిమాపై గట్టి నమ్మకంతోనే తెలుగు రిలీజ్ చేస్తున్నారట. తెలుగు, తమిళంలో మాస్ హీరోగా ధనుశ్ కి మంచి క్రేజ్ వుంది. మరి ఈ సినిమాల పోటీని తట్టుకుని 'మారి 2' నిలబడుతుందా లేదా చూడాలి.