రానా దగ్గుబాటి హోస్ట్ చేస్తున్న ‘నెం.1 యారి’ కార్యక్రమంలో ఇటీవల కలర్స్ స్వాతి యంగ్ హీరో నిఖిల్ తో కలిసి పాల్గొంది. ఈమధ్యనే పెళ్లి చేసుకుని మీడియాకు దూరంగా ఉంటున్న స్వాతి నుండి ఈ  కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్న రానా పలుప్రశ్నలు అడిగి ఆమె దగ్గరనుండి ఆసక్తికర సమాధానాలు రాబట్టాడు.
పేదవారికే రిజర్వేషన్లు ఇవ్వాలి
ఈ కార్యక్రంలో మాట్లాడుతూ స్వాతి పవన్ కళ్యాణ్‌ లో స్టైల్ యాటిట్యూడ్ తనకు నచ్చుతుంది అని అంటూ ప్రిన్స్ మహేష్ బాబు తీరు పై ఆసక్తికర కామెంట్స్ చేసింది.  మహేష్ బాబు చాలా కామ్ అని చాలామంది అనుకుంటూ ఉంటారని కాని మహేష్ ఎంత విట్టీగా చమత్కారంగా ఉంటాడో చాలామందికి తెలియదు అని అంటూ అటువంటి ఇమేజ్ మెయిన్ టైన్ చేయడం అంత సులువు కాదు అని కామెంట్స్ చేసింది.  జూ ఎన్టీఆర్ నుంచి టాలెంట్ ప్రభాస్ నుంచి హైట్ రానా లవింగ్ నేచర్ తనకు ఇష్టం అంటూ  స్వాతి నేటి తరం ప్రముఖ యంగ్ హీరోల పై తన అభిప్రాయాలు  వెల్లడించింది. 
ఇండస్ట్రీలో అమ్మాయిలు లూజ్ క్యారెక్టర్, చాలా మంది మగాళ్లతో పడుకుంటారనేది...
ఇదే ఇంటర్వ్యూలో స్వాతి మరో ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఇండస్ట్రీలో అమ్మాయిలకు లూజ్ క్యారెక్టర్ ఉంటుందని చాలామంది మగాళ్లతో తిరిగి నప్పుడు మాత్రమే అవకాశాలు వస్తాయి  అన్న కామెంట్స్ వల్ల అనేక మంది టాలెంట్ ఉన్న అమ్మాయిలు సినిమాలకు దూరంగా ఉంటున్నారు అంటూ కామెంట్స్ చేసింది. స్వాతితో కలసి ఇదే ఇంటర్వ్యూలో పాల్గొన్న నిఖిల్ ను ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న రానా సమాజంలో నువ్వు చూడాలనుకుంటున్న మార్పు ఏమిటి ? అని అడిగిన ప్రశ్నకు షాకింగ్ సమాధానం ఇచ్చాడు. 
మహేష్ బాబు గురించి చాలా మందికి తెలియదు
మన సిస్టంలో రిజర్వేషన్స్ అనేవి కాస్ట్ రిలీజియన్ బేస్డ్ కాకుండా అన్ని కులాలకు చెందిన  పేదవారికి ఇవ్వాలి అంటూ తక్కువ ఆదాయం ఉన్నవారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే ఇండియా బాగుపడుతుంది అలా తన అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియచేసాడు. ఇదే ఇంటర్వ్యూలో రానా మరో సారి స్వాతిని టైమ్ మిషన్ లో ట్రావెల్  చేసే అవకాశం వస్తే ఏం చేస్తావు ? అనే ప్రశ్నకు స్వాతి రియాక్ట్ అవుతూ  తాను  గతంలో నటించి ఫెయిల్ అయిన కొన్ని సినిమాలు తిరస్కరిస్తాను అని అంటూ  కామెంట్స్ చేసింది. ఇలా ఎన్నో విషయాల పై స్వాతి తన ప్రియ మిత్రుడు నిఖిల్ తో కలిసి ఇచ్చిన ఈ బుల్లితెర ఇంటర్వ్యూ కార్యకమం చాలామందిని ఆకర్షించింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: