తెలుగు ఇండస్ట్రీలో సినీ నేపథ్యంలో ఆ మద్య నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘మహానటి’చిత్రం వచ్చింది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ మహానటి సావిత్రి పాత్రలో నటించి విమర్శకుల నుంచి ప్రశంసలు పొందింది. అంచనాలు మించి హిట్ అయిన ఈ చిత్రం కలెక్షన్లు కూడా బాగానే వసూళ్లు చేసింది. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో వస్తున్న ‘ఎన్టీఆర్’బయోపిక్ షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. అయితే ఈ చిత్రాన్ని రెండు బాగాలుగా ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు ’ గా రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే.
కథానాయకుడు లో ఎక్కువ మంది హీరోయిన్లు దర్శనమివ్వబోతున్నారు. ఈ భాగాన్ని త్వరగానే పూర్తి చేసిన క్రిష్..మహానాయకుడు విషయంలో జాప్యం జరుగుతూ వచ్చింది. రీసెంట్ గా తెలంగాణలో ఎన్నికలు రావడం..బాలకృష్ణ ప్రచారాంలో నిమగ్నం కావడం..కొంత ఆలస్యానికి కారణం అంటున్నారు. మరోవైపు 'ఎన్టీఆర్ మహా నాయకుడు', మణికర్ణిక...ఈ రెండు చిత్రాలకూ దర్శకత్వం వహించింది క్రిష్ జాగర్లమూడి.
ఈ రెండు సినిమాలూ ఒక రోజు తర్వాత ఒకటి ప్రేక్షకుల ముందు వస్తున్నాయని గతంలో విడుదల తేదీలను ప్రకటించినప్పుడు నెటిజన్లు కొన్ని విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహా నాయకుడు విడుదల తేదీల్లో ఎక్కువ వ్యవధి ఉండాలనో క్రిష్ జాగర్లమూడి. 'ఎన్టీఆర్' చిత్రబృందం నిర్ణయం మార్చుకున్నారు.
దాంతో 'ఎన్టీఆర్ మహా నాయకుడు' విడుదల తేదీని మార్చారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి ఏడున విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. గతంలో జనవరి 9న 'ఎన్టీఆర్ కథానాయకుడు', 24న 'ఎన్టీఆర్ మహా నాయకుడు' విడుదల చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.