టాలీవుడ్ లో అక్కినేని ఫ్యామిలీ నుంచి ‘ప్రేమకథ’సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు అక్కినేని సుమంత్. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించినా ఏ సినిమా కూడా పెద్దగా సక్సెస్ అందుకోలేదు. గత ఏడాది మళ్ళీ రావా అనే డీసెంట్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాతో మంచి విజయం అందుకుంది. ఈ మద్య సుమంత్ వైవిధ్యభరిత పాత్రల్లో కనిపిస్తున్నాడు. ఈ మద్య సస్పెన్స్, థ్రిల్లర్ గా వచ్చిన 'సుబ్రహ్మణ్యపురం' మిశ్రమ స్పందన వచ్చినా..ఈ సినిమాలో సుమంత్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తాజా సుమంత్..అనిల్ శ్రీకంఠం దర్శకత్వంలో ‘ఇదం జగత్’ అనే సినిమా చేసాడు. ఇప్పటికే విడుదలైన ఈ టీజర్తో ఈ మూవీ కాన్సెప్ట్ను రివీల్ చేసిన ఈ చిత్ర యూనిట్ తాజాగా ‘ఇదం జగత్’ ట్రైలర్ను రిలీజ్ చేశారు.
ఇక విరాట్ ఫిల్మ్స్, శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ పతాకాలపై జొన్నగడ్డల పద్మావతి, శ్రీధర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘గుంటూరు టాకీస్’, ‘పీఎస్వీ గరుడవేగ’ వంటి చిత్రాలకు పనిచేసిన శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. ఆద్యంతం ఉత్కంఠని రేకెత్తిస్తున్న ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలే పెంచింది. సుమంత్ చెప్పిన పలు డైలాగ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఇక ట్రైలర్ లో 'ఒక రిపోర్టర్ సైలెంట్ గా ఉన్నాడంటే దాని అర్థం .. వాడు మనకి దగ్గరగా వచ్చేశాడని' అనే డైలాగ్ తో ఈ ట్రైలర్ మొదలవుతోంది.
యాక్షన్ .. ఎమోషన్ .. సస్పెన్స్ తో కూడిన సన్నివేశాలపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ ఇస్తుందనే నమ్మకంతో సుమంత్ వున్నాడు. సుమంత్ జోడీగా అంజు కురియన్ నటించిన ఈ సినిమాకి శ్రీకాంత్ నీలకంఠం దర్శకత్వం వహించాడు. ఇదం జగత్ సినిమాలో శివాజీ రాజా, సత్య, ప్రియదర్శిని రామ్, ఆదిత్యమీనన్, కళ్యాణ్ విథపు, షఫీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.