ఎన్టీఆర్ బయో పిక్ ఆడియో ఫంక్షన్ కు జూనియర్ ఎన్టీఆర్ వస్తాడా .. రాడా అన్న సస్పెన్స్ కు తెర పడింది. నిమ్మూకూరులో భారీ ఎత్తున జరుగబోతున్న ‘ఎన్టీఆర్’ ఆడియో మరియు ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో నందమూరి కుటుంబ సభ్యులు అంతా పాల్గొనబోతున్నారట. వారిలో జూనియర్ కూడా ఉండనున్నాడట. కళ్యాణ్ రామ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ లు ఆ వేడుకలో ప్రత్యేకంగా ఉండబోతున్నట్లుగా చెబుతున్నారు.


ఈ వేడుకలోనే మోక్షజ్ఞ కూడా పాల్గొంటాడనే టాక్ వినిపిస్తుంది.ఈ కార్యక్రమంలో నందమూరి కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా సూపర్ స్టార్ కృష్ణ - రెబల్ స్టార్ కృష్ణం రాజు మోహన్ బాబు - జమున - గీతాంజలి ఇంకా అలనాటి తారలు - దర్శకులు - నిర్మాతలు ఎంతో మంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.‘ఎన్టీఆర్’ పై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

Jr NTR Gracing NTR Biopic Audio Launch

ఎన్టీఆర్ తో సహా కుటుంబ సభ్యులు - ప్రముఖ నటీ నటులు కూడా ఈ వేడుకలో పాల్గొంటే అంచనాలు మరింతగా పెరగనున్నాయి.మొన్నటి వరకు జక్కన్న మల్టీస్టారర్ మూవీ చిత్రీకరణలో పాల్గొన్న ఎన్టీఆర్ సంక్రాంతి తర్వాత మళ్లీ మల్టీస్టారర్ చిత్రీకరణలో పాల్గొనాల్సి ఉంది. ప్రస్తుతానికి ఎన్టీఆర్ ఖాళీగానే ఉన్నాడు కనుక బాబాయి మూవీ అదీ తాతగారి బయోపిక్ మూవీ కనుక ఎన్టీఆర్ నిమ్మకూరు వేడుకలో పాల్గొనాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: