ఈరోజు విడుదలైన ‘అంతరిక్షం’ మూవీని ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ ప్రస్తుతం రగులుతున్న బాలకృష్ణ నాగబాబుల వివాదం పై ఆసక్తికర కామెంట్స్ చేసాడు. ఈమధ్య నాగబాబు ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలకృష్ణ ఎవరో తనకు తెలియదు అన్న విషయం పై స్పందిస్తూ ఈవిషయం పై తన తండ్రి నాగబాబును తాను వ్యక్తిగతంగా అడిగినప్పుడు నాగబాబు చేసిన ఆసక్తికర కామెంట్స్ ను బయట పెట్టాడు వరుణ్ తేజ్.
హాలీవుడ్ ప్రమాణాలకు ధీటుగా
గతంలో బాలకృష్ణ తనకు పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదు అని చేసిన కామెంట్స్ కు బాథపది తాను అలా కామెంట్ చేసానని తన తమ్ముడు పై ఎవరైనా సెటైర్లు వేస్తే కనీసం తాను స్పందించవలసిన బాధ్యత లేదా అని తనకు తన తండ్రి ఎదురు ప్రశ్నలు వేసిన విషయాన్ని బయటపెట్టాడు నాగబాబు. పవన్ పై అప్పట్లో బాలయ్య చేసిన కామెంట్స్ కు తమ మెగా ఫ్యామిలీ అంతా బాధపడిన విషయాన్ని వివరిస్తూ తన తండ్రి తమ మెగా ఫ్యామిలీలో ఎవరికీ అవమానం జరిగినా సహించడు అన్న విషయాన్ని తెలియచేసాడు ఈ మెగా ప్రిన్స్. 
జీరో గ్రావిటేషన్‌తో
ఇక రాబోతున్న ఎన్నికలలో తమ మెగా కుటుంబ సభ్యులు అంతా ‘జనసేన’ కు ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని చెపుతూ తామంతా పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్న విషయాన్ని వివరించాడు. ఇది ఇలా ఉండగా ఈరోజు విడుదలైన ‘అంతరిక్షం’ మూవీ ఓవర్సీస్ టాక్ బయటకు వచ్చింది. 
క్రిష్, సాయిబాబు జాగర్లమూడి నిర్మాతగా
ఈమూవీని చూసిన ఓవర్సీస్ ప్రేక్షకులలో కొంతమంది ఒక హాలీవుడ్ సినిమాను చూసినట్లు ఉంది అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మరికొందరైతే ఈమూవీలో కొన్ని సన్నివేశాలు మాత్రమే బాగున్నాయని మూవీ అంతా సీరియస్ గా నడిచిందని అభిప్రాయపడుతున్నారు. దీనినిబట్టి చూస్తుంటే ఈమూవీకి ఓవర్సీస్ లో డివైడ్ టాక్ వచ్చిందా అన్న సందేహం కలుగుతోంది..   


మరింత సమాచారం తెలుసుకోండి: