తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా బయోపిక్ చిత్రాల గురించే చర్చలు నడుస్తున్నాయి. ఇప్పటికే మహానటి బయోపిక్ మంచి రిజల్ట్ రావడంతో ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో మహానటులు ‘ఎన్టీఆర్’బయోపిక్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు .  ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు.  అంతే కాదు రాజకీయ నేపథ్యంలో కూడా పలు చిత్రాలు వస్తున్నాయి.  దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా ‘యాత్ర’చిత్రం రాబోతుంది. 

ఆనందో బ్రహ్మ ఫేమ్ మహిర్ రాఘవ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో మళియాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తున్నారు.  ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్, లిరిక్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి ఆదరణ లభించింది. నేడు వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు చిత్ర బృందం.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై చెరగని ముద్ర వేసిన రాజశేఖర రెడ్డి పాదయాత్రను ఈ చిత్రంలో ప్రధానంగా చూపించబోతున్నారు. 2019 ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో ఈ చిత్రంలో ఏపీలో పొలిటికల్ హీట్ పెంచుతోంది.  టీజర్ ‘నీళ్లు ఉంటే కరెంట్‌ ఉండదు. కరెంట్‌ ఉంటే నీళ్లు ఉండవు. రెండు ఉండి పంట చేతికొస్తే సరైన ధర ఉండదు. అందరూ రైతే రాజు అంటారు. సరైన కూడు, గుడ్డ, నీడ లేని ఈ రాచరికం మాకొద్దయ్యా.

మమ్మల్ని రాజులుగా కాదు.. కనీసం రైతులుగా బతకనివ్వండి చాలు’అంటూ ఓ రైతు ఆవేదన చెందుతుంటే..చలించిపోయిన ప్రభుత్వంపై సమర శంఖారావాన్ని పూరిస్తూ వైఎస్ పాదయాత్ర మొదలు పెట్టడం చూపించారు.  ‘నేను విన్నాను.. నేనున్నాను’ అంటూ వైఎస్ పాత్రలో మమ్ముట్టి పలికే డైలాగ్స్‌ ట్రైలర్ మొత్తానికే హైలెట్‌గా చెప్పొచ్చు. 70 ఎంఎం పతాకంపై మహిర్ రాఘవ తెరకెక్కిస్తోన్న ‘యాత్ర’ ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: