గత కొంత కాలంగా బుల్లితెరపై ‘జబర్ధస్త్’కామెడీ షో ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. జబర్ధస్త్ కామెడీ షో తమదైన కామెడీ మార్క్ చాటుకుంటూ..కొత్త కొత్త స్కిట్స్ తో వస్తూ అందరినీ అలరిస్తున్నారు. ముఖ్యంగా జబర్ధస్త్ కామెడీ షో తో హాట్ యాంకర్లుగా పేరు తెచ్చుకున్నారు అనసూయ, రష్మి. ప్రస్తుతం జబర్ధస్త్ కామెడీ షో వచ్చిన వారు వెండితెరపై కమెడియన్లుగా, నటీమణులుగా రాణిస్తున్నారు. ఇక జబర్ధస్త్ కామెడీ షో అంటే వెంటనే గుర్తుకు వచ్చేది హైపర్ ఆది. స్కిట్ మొదలు పెట్టినప్పటి నుంచి ఎండింగ్ వరకు తనదైన పంచ్ లతో కడుపుబ్బా నవ్విస్తుంటాడు.
కొంతకాలంగా ఆది ‘జబర్దస్’లో కనిపించకపోవడంతో బుల్లితెర ప్రేక్షకులంతా నిరాశకు గురవుతున్నారు. ఆదికి యాక్సిడెంట్ అయిందని, పెళ్లి చేసుకున్నాడని, పవన్కళ్యాణ్ అభిమాని కావడంతో జనసేన పార్టీలో చేరుతున్నాడని.. ఇలా ఎవరికి తోచినట్టుగా వారు ప్రచారం చేశారు. తాజాగా ఒ యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఆది మాట్లాడారు. ఈ మద్య తనపై రక రకాల రూమర్లు వస్తున్నాయని..యాక్సిడెంట్ అయ్యిందని..పెళ్లి చేసుకున్నారని..జనసేన పార్టీలో చేరారని..కానీ వాస్తవానికి అవేవీ కావని చెప్పారు ఆది.
షూటింగులతో పాటు కొన్న వ్యక్తిగత పనుల ఒత్తిడి కారణంగానే బజర్దస్త్కు దూరమయ్యాయని జనవరిలో మళ్లీ రీ ఎంట్రీ ఇస్తానని అన్నారు. ప్రస్తుతం మిస్టర్ మజ్ను, చిత్రలహరి చిత్రాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు తెలిపారు. పవన్ కళ్యాన్ అంటే ఇష్టమని...ఆ విషయంలోనే గతంలో కత్తి మహేష్ తో వాగ్వాదానికి దిగానని..వాస్తవానికి ఇండస్ట్రీలో, బయట తనకు శత్రువులు ఎవరూ లేరని అన్నారు.
చిన్నప్పటి నుంచి చిరంజీవికి అభిమానినని, అందుకే జబర్దస్త్లో మెగా ఫ్యామిలీకి సంబంధించి డైలాగులే ఎక్కువగా చెబుతానని, ఆ పాటలకే డ్యాన్సులు చేస్తానని చెప్పారు. ఇక పవన్ కళ్యాన్ స్థాపించిన ‘జనసేన’పార్టీలో చేరడం లేదని..ఆయన వ్యక్తిత్వం, నిడారంబరత అంటే ఎంతో ఇష్టమని..ఎప్పుడైనా పవన్ కళ్యాన్ కి నా మద్దతు ఇస్తూనే ఉంటానని అన్నారు.