సరిగ్గా బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయో పిక్ ఆడియో రోజునే వర్మ వెన్నుపోటు కుట్ర సాంగ్ ను రిలీజ్ చేశాడు. వ్యూస్ కూడా బాగానే వచ్చాయి. అయితే టీడీపీ ఇప్పడూ బగ్గు మంటుంది. బాలకృష్ణ వర్సెస్ రాం గోపాల్ వర్మ గా టర్న్ అయిన ఎన్టీఆర్ బయోపిక్ సినిమా లు ఇప్పుడు రాజకీయంగా ప్రకంపనా లను సృష్టిస్తోంది. ఇంకా సినిమాలు విడుదల కాకుముందే ఈ రగడ మొదలైంది. నందమూరి- టిడిపి అభిమానులు బాలకృష్ణ ఆధ్వర్యంలో వస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇదే సమయంలో పోటీగా ఆర్జీవీ తీస్తు న్న సినిమా పై టిడిపి వ్యతిరేకుల ఆసక్తి పెరుగుతోంది.
దీనికి తోడు సరిగ్గా..బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ సంబంధించి ఆడియో లాంచ్ చేసిన సమయంలో..వివాదాలకు మారు పేరైన ఆర్జీవి వెన్నుపోటు పేరుతో ఒక పాటను విడుదల చేసా రు. దీనికి భారీ స్థాయిలో వ్యూస్ వచ్చాయి. అయితే, అందులో వెన్నుపోట పాటలో ఎన్టీఆర తో పాటుగా చంద్రబాబు ఫొటోలను..వీడియోలను వినియోంచారు. ఇప్పుడు ఇదే వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఎన్టీఆర్ జీవిత చరిత్ర లో 1995 వైస్రాయ్ హోటల్ ఎపిసోడ్ పై చాలా అసక్తి కనిపిస్తోంది. దీనిని బాలకృష్ణ ఎంత వరకు కవర్ చేస్తారో అనేది సందేహమే. ఇదే సమయంలో..అదే ఎపిసోడ్ కు ఆర్జీవి ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం.
రాం గోపాల్ వర్మ వెన్నుపోటు పాటను విడుదల చేయగానే...అందులో చంద్రబాబు ఫొటోలు చూసి ఒక్క సారిగా టిడిపి నేతలు..అభిమానులు షాక్ అయ్యారు. వెంటనే కౌంటర్ చర్యలు ప్రారంభించారు. ఒక వైపు టిడిపి నేతలు ఆర్జీవి ని లక్ష్యంగా చేసుకొని దుమ్మెత్తి పోస్తున్నారు. మరో వైపు టిడిపి సోషల్ మీడియా కౌంటర్ ఎటాక్ మొదలు పెట్టింది. ఇదే సమయంలో చంద్రబాబు వ్యతిరేకులు మాత్రం.. ఆర్జీవి చాలా బోల్డ్ గా పాటను చిత్రీకరించారని..దీనికి టిడిపి బౌల్డ్ అవ్వాల్సిందేనని కామెంట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో..చంద్రబాబు ఫొటోలు అనుమతి లేకుండా వినియోగిస్తూ దురుద్దేశాలు ఆపాదించే ప్రయత్నం చేసారంటూ ఆర్జీవి పై న్యాయ పోరాటానికి సిద్దం కావాలని టిడిపి నేతలు ఆలోచ న చేస్తున్నారు. ఎన్నికల సమయం కావటంతో..ఇప్పుడు రాజకీయంగానూ ఇది హాట్ టాపిక్గా మారుతోంది.