నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ రెండు పార్టులకు సంబందించి ఆడియో వేడుక నిన్న జె.ఆర్.సి కన్వెన్షన్ లో జరిగింది. నందమూరి కుటుంబంతో పాటుగా సిని పెద్దలు కూడా ఈ వేడుకలో భాగమవడం జరిగింది. ఇక ఈ సినిమా ట్రైలర్ నందమూరి అభిమానులకే కాదు తెలుగు ప్రేక్షకులందరిని అలరిస్తుంది.


సినిమా ఈవెంట్ లో భాగంగా ఎన్.టి.ఆర్ బయోపిక్ లో నటించిన వారందరి గురించి బాలకృష్ణ మాట్లాడటం జరిగింది. మొత్తం కార్యక్రమం ఆయన వేదిక మీద ఉండి నడిపించారు. ఎన్.టి.ఆర్ బయోపిక్ ను ఆయన ఎంత బాధ్యతగా తీసుకున్నారో ఆయన్ను చూస్తే అర్ధమవుతుంది. ఇక ఇదే వేదిక మీద తన తర్వాత సినిమా ఎనౌన్స్ మెంట్ కూడా ఇచ్చి సర్ ప్రైజ్ చేశాడు బాలయ్య. 


సిం హా, లెజెండ్ సినిమాలు చేసిన బోయపాటి శ్రీను డైరక్షన్ లో మరో సెన్సేషనల్ మూవీ రాబోతుంది. ఫిబ్రవరిలో ఈ సినిమా మొదలవుతుందని నందమూరి ఫ్యాన్స్ ముందే బిగ్ ఎనౌన్స్ మెంట్ ఇచ్చాడు బాలకృష్ణ. 100 సినిమాలు పూర్తి చేసుకున్న బాలయ్య సెంచరీ కొట్టిననాటి నుండి స్పీడు పెంచాడని చెప్పొచ్చు. 


ఎన్.టి.ఆర్ కథానాయకుడు, మహానాయకుడు రెండు ముందు ఒకే సినిమాగా చూపించాలని అనుకున్నా బాహుబలి స్పూర్తితో పార్ట్ 1, పార్ట్ 2గా చేశారు. ఎన్.టి.ఆర్ బయోపిక్ ఎలాగు తారక్ చెప్పినట్టు ఆడుద్దా ఆడదా అని కాదు చరిత్ర సృష్టిస్తున్న బాలయ్య తన సినిమాల ప్లానింగ్ కూడా పర్ఫెక్ట్ గా చేసుకున్నాడని చెప్పొచ్చు. 



మరింత సమాచారం తెలుసుకోండి: