నిన్న సాయంత్రం హైదరాబాద్ జేఆర్సీ సెంటర్ లో నందమూరి కుటుంబ సభ్యులు అభిమానుల సమక్షంలో అత్యంత ఘనంగా జరిగిన ‘ఎన్టీఆర్’ బయో పిక్ ఆడియో లాంచ్ ఫంక్షన్ లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చేసిన కామెంట్స్ పై ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. 
 తరతరాలు ఆ పెర్ఫార్మెన్స్ అలా ఉండిపోతుంది
ఎన్టీఆర్ తో తన సాన్నిహిత్యం గురించి మోహన్ బాబు మాట్లాడుతూ  మధ్యలో చేసిన ఒక వివాదాస్పద కామెంట్ పై ప్రస్తుతం ఫిలిం సర్కిల్స్ అదేవిధంగా రాజకీయ వర్గాలలో లోతైన చర్చలు జరుగుతున్నాయి. ఈసినిమాకు దర్శకత్యం వహించిన క్రిష్ గురించి మాట్లాడుతూ ఎన్టీఆర్ లైఫ్ లో కొందరు చెడ్డవాళ్లు ఉన్నారు వాళ్లను డైరెక్టర్ క్రిష్ ఈచిత్రంలో చూపించారో లేదో తెలీదు అంటూ వ్యాఖ్యానించాడు. అంతేకాదు క్రిష్ చెడ్డవాళ్లను కూడా మంచివాళ్లుగానే చూపించాడేమో అంటూ సందేహాలను వ్యక్త పరిచాడు మోహన్ బాబు. 
 అన్నయ్య మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నా
ఆతరువాత ఈవిషయాల పై మరికొంత వివరంగా మాట్లాడుతూ గతంలో ఎన్టీఆర్ తనతో ఈవిషయాలను కొన్నిటిని షేర్ చేసుకున్నారు అంటూ  వాటిని ఈవేదిక పై తాను చెప్పలేనని అనడం మరింత సంచలనంగా మారింది. దీనితో నిన్నటి ఫంక్షన్ లో మోహన్ బాబు స్పీచ్ అయిపోయిన వెంటనే ఆఫంక్షన్ కు వచ్చిన చాలామంది ఆ విషయాల పై ఆ ఫంక్షన్ లోనే మాట్లాడు కున్నట్లు టాక్. 
ఆ విషయం ఇక్కడ చెప్పకూడదు
అంతేకాదు ఎన్టీఆర్ జీవితంలో ఉన్న ఆ చెడ్డవాళ్లు ఎవరు అంటూ ఆసక్తికర చర్చకొనసాగుతోంది. ఒక తల్లి గర్భంలో జన్మించకపోయినా నందమూరి తారకరామారావు తాను అన్నదమ్ములమే అంటూ   మహానటుడు ఎన్టీఆర్ తో తనకు ఉన్న ప్రత్యేక అనుబంధ గురించి చెపుతూ మధ్యలో ఇలా ఎన్టీఆర్ శత్రువులు గురించి ఎందుకు మాట్లాడాడు అన్న విషయం సమాధానం లేని ప్రశ్నగా మారింది. దీనికితోడు ప్రస్తుతం వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తీస్తున్న నేపధ్యంలో మోహన్ బాబు అన్నమాటలు వర్మ ఫాలో అయితే ఈ విషయాలా పై మరింత రగడ జరిగే ఆస్కారం ఉంది అని అంటున్నారు. ఏమైనా మోహన్ బాబు ఇప్పుడు ఈకామెంట్స్ ఎందుకు చేసాడో ఎవరికి అర్ధంకాని విషయంగా మారింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: