హాలీవుడ్ లో మొదలై టాలీవుడ్ వరకు షేక్ చేసిన ‘మీటూ’ ఉద్యమం పై ఈమధ్య రగడ కొంత వరకుచల్లారింది. బాలీవుడ్ బ్యూటీ తనుశ్రీదత్త చేసిన వ్యాఖ్యలతో బాలీవుడ్ లో ప్రకంపనలు రావడమే కాకుండా ఈ విషయంలో వివాదాలు ఎదుర్కున్న చాలామంది సినీప్రముఖులను అనేక సినిమాల నుంచి తొలిగించిన విషయాలు కూడ తెలిసినవే. 
ప్రతి ఒక్కరూ అదేవిధంగా
ఇలాంటి పరిస్థితులలో ఈమధ్య కొంతవరకు వేడి చల్లారిన ఈఉద్యమం పై ప్రముఖ నటుడు అరవిందస్వామి షాకింగ్ కామెంట్స్ చేసాడు.  ‘మీటూ’ ఉద్యమం పై తన అభిప్రాయం తెలియచేయమని ఆఇంటర్వ్యూను నిర్వహిస్తున్న వ్యక్తి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ  ఒకరు వ్యక్తిగతంగా ఎదుర్కొన్న ఆరోపణనలు సమస్యల గురించి తన స్పందన ఎందుకు అడుగుతున్నారని ఎదురు ప్రశ్నలు వేసాడు అరవింద్ స్వామి.
ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా
ప్రస్తుతం ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా అందుబాటులో ఉన్న నేపధ్యంలో ప్రతి ఒక్కరు ఎవరికి వారు తమకు తోచిన అభిప్రాయాలను చెపుతున్నారని అదేవిధంగా ఒక సమస్యని అడ్డు పెట్టుకుని పబ్లిసిటీ పొందాలని చూస్తున్నారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. ఒక వ్యక్తి  వ్యక్తిగతంగా ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆవ్యక్తి స్పందించకుండా మరో వ్యక్తి నాయకత్వం వహించాలని ఎందుకు అనుకుంటున్నారో తనకు అర్ధం కావడంలేదు అంటూ కామెంట్స్ చేసాడు అరవిందస్వామి. 
చిన్మయి వివాదం
తమిళంలో చిన్మయి వైరముత్తు పై చేసిన సంచలన ఆరోపణల గురించి మాట్లాడుతూ ఎప్పుడో జరిగిపోయిన సంఘటన గురించి చిన్మయి అప్పుడు స్పందించకుండా ఇంత ఆలస్యంగా ఆమె ఎందుకు స్పందించిందో తనకు అర్ధం కావడం లేదు అంటూ మరో ట్విస్ట్ ఇచ్చాడు ఈ విలక్షణ నటుడు. అంతేకాదు ఇండియాలో ‘మీటూ’ ఉద్యమానికి మించిన అనేక సమస్యలు ఉన్నాయని అయితే వాటి గురించి కూడ ఫిలిం సెలెబ్రెటీలు తమ అభిప్రాయాలు మాట్లాడితే బాగుంటుంది అన్న అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తున్నాడు. అరవింద స్వామి చేసిన ఈ కామెంట్స్ తో మళ్ళీ ఈ ఉద్యమం పై మరిన్ని షాకింగ్ కామెంట్స్ రాబోతున్నాయి అనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: