తెలుగు, హిందీ భాషల్లో ఇప్పటి వరుకు ఎన్నో సంచలన చిత్రాలు తెరకెక్కించిన సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఈ చిత్రం షూటింగ్ చాలా సైలెంట్ గా కానిచ్చేస్తున్న రాంగోపాల్ వర్మ నిన్న ‘వెన్నుపోటు’ అనే సాంగ్ రిలీజ్ చేశారు.  ఈ సాంగ్ కేవలం ఏపి సీఎం చంద్రబాబు ని టార్గెట్ చేసుకొనేలా ఉందని.. రామ్ గోపాల్ వర్మ సహా చిత్రయూనిట్ పై టీడీపీ నేతలు మండిపడుతున్న విషయం తెలిసిందే.

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఇలాంటి నెగిటీవ్ ప్రచారం బహిరంగంగా చేయడంపై టీడీపీ నేతలు కస్సుబుస్సుమంటున్నారు. వారిపై పరువు నష్టంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు టీడీపీ నేత ఎస్వీ మోహన్ రెడ్డి చెప్పడంపై వర్మ స్పందించారు.

అది కూడా చాలా వ్యంగంగా..లక్ష్మీస్ ఎన్టీఆర్’ లోని ‘వెన్నుపోటు’ పాటపై నిరసన వ్యక్తం చేస్తూ పోలీసులకు ఎవరైతే ఫిర్యాదులు చేస్తున్నారో, దిష్టిబొమ్మలు దహనం చేస్తున్నారో, విమర్శలు చేస్తున్నారో..నన్ను ఏదైనా చేయాలనుకుంటున్నారో..వారందరికీ నా కృతజ్ఞతలు.  ఎందుకంటే మీరు ‘వెన్నుపోటు’పాట విన్నారు..అంటే వీక్షకుల సంఖ్యను మరింతగా పెంచుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: