రామ్ గోపాల్ వర్మ ఏ సినిమా చేసిన అందులో వివాదం ఉండాల్సిందే. అయితే వర్మ ఈ సారి తీయబోయే సినిమా ఎన్టీఆర్ మీద అవ్వడంతో వివాదం ముదిరి సినిమా మీద ఆసక్తి ని పెంచుతుంది. ఇప్పటికే పోల్స్ లో ఈ సినిమా కు మూడొంతుల మంది సపోర్ట్ చేశారు. అయితే నిన్న రిలీజ్ చేసిన ‘యన్.టి.ఆర్’ ట్రైలర్లో భారీతనం.. విజువల్ బ్రిలియన్స్.. కళాత్మక దృష్టి కనిపించాయి కానీ.. ఈ చిత్రంలో ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలూ ఉంటాయా అన్నది మాత్రం సందేహంగానే కనిపించింది.


వర్మ దెబ్బ .. టీడీపీ ఏం చేయబోతుంది .. తరువాత స్టెప్ అదేనా ..!

నటుడిగా ఎన్టీఆర్ ఎదుగుదల.. రాజకీయ రంగప్రవేశం.. అందులో విజయాలు.. ఆరంభ దశలో ఒడుదొడుకుల వరకే చూపించినట్లున్నారు. అంతకుమించి రాజకీయ రంగంలో రెండో దశను.. చంద్రబాబు వెన్ను పోటు వ్యవహారాన్ని అస్సలు టచ్ చేసినట్లు లేదు. జీవిత చరమాంకంలో రామారావు అనుభవించిన మానసిక క్షోభకు ఇందులో చోటే లేనట్లుంది. దీంతో ఈ బయోపిక్ ఎలా పరిపూర్ణం అవుతుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


ఈ నేపథ్యంలోనే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఆసక్తి రేకెత్తిస్తోంది. వర్మ ఇప్పటికి ఏం తీస్తున్నాడో కానీ.. ‘యన్.టి.ఆర్’ రెండు భాగాలూ విడుదలయ్యే వరకు ఎదురు చూసి.. అందులో మిస్సయిన అంశాలన్నింటినీ తన చిత్రంలో ఉండేట్లు చూడాలని కోరుకుంటున్నారు జనాలు. రెండు బయోపిక్స్ లో ఏది ఒరిజినల్.. ఏది ఎక్కువ ఆసక్తి రేకెత్తిస్తోందని వర్మ పోల్స్ పెడితే మూడింట రెండొంతుల మంది ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కే ఓటేయడం విశేషం. ఓట్లు వేసింది వంద మందో వెయ్యి మందో కూడా కాదు. 40-50 వేల దాకా ఓట్లు పడ్డాయి. ఈ స్థాయి ఓటింగ్లో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కు అంత మెజారిటీ రావడం ప్రేక్షకుల ఆసక్తిని తెలియజేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: