రామ్ గోపాల్ వర్మ వెన్నుపోటు పాట తో అలజడి ని రేపాడు. అయితే వర్మ తీస్తున్న సినిమా ఎలాగైనా అడ్డుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తుంది అని చెప్పడం లో ఎటువంటి ఆశ్చర్యం లేదు . ఎందుకంటే టీడీపీ ఎలాగూ అధికారం లో ఉంది కాబట్టి అయితే వర్మ లాంటి తల తిక్క డైరెక్టర్ , వివాదాల డైరెక్టర్ దగ్గర మాత్రం ఈ జిమ్మిక్కులు పని చేయవు అని చెప్పొచ్చు. ఎందుకంటే తన సినిమా ను నేరుగా యూట్యూబ్ లో రిలీజ్ చేయగల ఘనుడు కాబట్టి.
అయితే వర్మ మాట్లాడతూ, ఏ దేశమేగిన ఎందెందు కాలిడినా పొగడరా నీ తల్లి తెలుగు భారతిని. తొలిసారి విన్నప్పుడు కలిగే అనుభూతి వేరు. ప్రతి ఒక్కరూ దణ్ణం పెట్టి బతిమాలుకుని ఓట్లు అడుగుతారు.. ఎన్టీఆర్ ఒక్కరే రేయ్ అని ఓట్లు అడిగారు. మొదటిసారి అలా అడిగింది ఆయనొక్కరే. నిజాయితీ వల్లనే అది సాధ్యం. ఒక మనిషిగా - హీరోగా - నాయకుడిగా ఉన్న ఆయన ఎన్టీఆర్ శ్రీదేవి - జయసుధ - జయప్రద లాంటి అందగత్తెల్ని వదిలేసి - వాళ్లకు ద్రోహం చేసి లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకోవడమేంటి? అన్న సందిగ్ధత కలిగింది.
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీసేప్పుడు పరిశోధించాను. అసలు నిజం ఏంటి? అని వెతికితే.. అయితే లక్ష్మీ పార్వతి గురించి చెప్పగలిగే ఒక ప్రత్యక్ష సాక్షి దొరికాడు. ఆయన పేరు ఏంటంటే యన్.టి.రామారావు. ఆయన నా కల్లోకి రాలేదు. యూట్యూబ్ ఆయన వీడియో ఒకటి చూశాను.. లక్ష్మీ పార్వతి గురించి మాట్లాడినది. ఆయన కంటే పెద్ద సాక్ష్యం ఎవరూ అవసరం లేదు`` అని అన్నారు.