‘ఫిదా’ ‘ఎమ్ సి ఎ’ మూవీల ఘన విజయంతో టాలీవుడ్  ఇండస్ట్రీలో సాయి పల్లవి మ్యానియా పెరిగిపోయింది. ఆమె తమ సినిమాలలో నటిస్తే చాలు కలక్షన్స్ కుంభవృష్టి లా కురుస్తాయి అన్న అభిప్రాయం దర్శక నిర్మాతలలో పెరిగ పోవడంతో సాయి పల్లవి చుట్టూ తిరిగే దర్శక నిర్మాతల లిస్టు విపరీతంగా పెరిగిపోయింది. ఆమె డేట్స్ ఇస్తే చాలు కోటిన్నరకు పైగా పారితోషికం ఇస్తాము అని అంటున్నారు అంటే ఆమె మ్యానియా ఏరేంజ్ లో పెరిగిపోయిందో అర్ధం అవుతుంది.

అయితే వచ్చిన సినిమాలు అన్నీ ఒప్పుకోకుండా సాయి పల్లవి చాల తక్కువ సినిమాలలో నటిస్తోంది. దాదాపు సంవత్సరం గ్యాప్ తరువాత ఈమె శర్వానంద్ తో కలిసి నటించిన ‘పడి పడి లేచె మనసు’ మూవీకి సాయి పల్లవి క్రేజ్ రీత్యా భారీ ఓపెనింగ్స్ వస్తాయని ఈమూవీ బయ్యర్లు భావించారు. అయితే ఈమూవీకి ఏవరేజ్ టాక్ రావడంతో ఈమె మ్యాజిక్ ఈమూవీని ఏమాత్రం రక్షించ లేకపోయింది.

దీనికితోడు దర్శకుడు హను రాఘవపూడి ఈమూవీ విషయంలో ఎటువంటి మ్యాజిక్ చేయలేకపోవడంతో పాటు ఈమూవీ సెకండ్ ఆఫ్ ఏమాత్రం ప్రేక్షకులకు నచ్చకపోవడంతో కనీసం ఈసినిమా సంక్రాంతి రేసు సినిమాలు విడుదల అయ్యేదాకా ధియేటర్లలలో ఉండగలుగుతుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికితోడు శర్వానంద్ కు ఇది మరో ఫ్లాప్ మూవీగా మారడంతో సాయి పల్లవి ఉంటే చాలు సినిమా హిట్ అవుతుంది అన్న అంచనాలకు బ్రేక్ పడింది అనుకోవాలి. 

అయితే ఈసినిమా  ప్రమోషన్ లో శర్వానంద్ మాట్లాడుతూ సాయి పల్లవిలో ఎటువంటి ఇగో లేదనీ ఆమె తన సినిమాలకు సంబంధించి దర్శక నిర్మాతలతో పాటు హీరోలకు కూడ బాగా సహకరిస్తుంది అంటూ కామెంట్స్ చేసాడు. కానీ ఆమె గోల్డెన్ లెగ్ ప్రభావం కొద్దిగా కరిగిపోతున్న నేపధ్యంలో భవిష్యత్ లో సాయి పల్లవి డేట్స్ కోసం ప్రస్తుతం కొనసాగుతున్న మ్యానియా కొంత వరకు తగ్గే ఆస్కారం ఉంది..   


మరింత సమాచారం తెలుసుకోండి: