భారతీయ చలన చిత్ర రంగంలో బహుబాషా నటిగా గుర్తింపు తెచ్చుకున్న గౌతమి ఈ మద్య సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నట్లు తెలిపింది.  మంచి పాత్రలు ఉంటే నటింగా తన ప్రస్థానం కొనసాగిస్తానని అంటుంది.  అయితే కమల్ హాసన్ తో దాదాపు పదమూడు సంవత్సరాలు సహజీవనం చేసిన గౌతమి ఆ మద్య విడిపోయిన విషయం తెలిసిందే.  ప్రస్తుతం రాజకీయంగా యాక్టీవ్ గా పలు సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంది.  తాజాగా దేశంలో వరుసగా జరుగుతున్న అత్యాచార ఘటనలపై సినీ నటి గౌతమి స్పందించింది.

అమ్మాయిలే కాకుండా అబ్బాయిలకు కూడా రక్షణ లేకుండా పోయిందని,  వారు కూడా లైంగిక వేధింపులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. చట్ట విరుద్ధ చర్యలను అడ్డుకుని ప్రజలకు రక్షణ కల్పించాల్సింది ప్రభుత్వాలేనని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. గతంలో కేన్సర్ బారిన పడిన తాను ఎలా కోలుకున్న విషయం గురించి తెలిపారు. 

యోగా సర్వరోగ నివారణి అని.. యోగా వల్లే తాను కేన్సర్ నుంచి బయటపడగలిగానని వివరించింది. యోగాసనాల వల్ల కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను మొగ్గ దశలోనే తుంచివేయవచ్చని పేర్కొంది.  యోగా ప్రాచీన కాలంగా వస్తున్నదని..దాన్ని భావి తరాలకు అందించే భాద్యత ప్రతి ఒక్కరిపైన ఉందని అన్నారు.  యోగా కారణంగానే తానిప్పుడు ఆరోగ్యంగా ఉన్నట్టు గౌతమి తెలిపింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: